ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్కు వచ్చిన లింక్ను క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..ఇటీవల కాలంలో …
Read More »నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్..
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది …
Read More »16 ఏళ్లకే ఏడు ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన హైదరాబాది!.. రికార్డులు చూస్తే..
సాధారణంగా ఒక్కొక్కరికి ఏదో ఓ అలవాటు ఉంటుంది. వాళ్లు ఆ పనిని చేసేందుకే చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఈ హైదరాబాదీ యువకుడు కూడా అంతే. ఈ యువకుడికి పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. దీంతో అదే పనిని హాబీగా మార్చుకున్నాడు. 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను ఎక్కి సత్తాచాటాడు. 2020లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ కుర్రాడు నాలుగేళ్లలోనే అనేక బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు, ప్రశంసలను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరీ …
Read More »ఆశ్చర్యంగా నెమలి ప్రవర్తన – 6 ఏళ్లుగా సమ్మక్క సారక్క గుడికి – సూర్యాస్తమయానికి మాయం
ఆరేళ్లుగా స్థానిక సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజూ దర్శనమిచ్చే ఈ నెమలి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం ఎనిమిదికి ఆలయానికి చేరి సాయంత్రం నాలుగున అడవికి వెళ్ళే ఈ నెమలిని.. భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఆ నెమలితో ప్రత్యేకంగా సెల్పీలు దిగుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కనిపించే ఓ నెమలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఆలయానికి చేరుకొని.. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవికి వెళ్లిపోతుంది. గత …
Read More »టీవీ9 క్రాస్ఫైర్లో ఈటల కామెంట్స్పై బీజేపీ చర్చ.. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ..
టీవీ9 క్రాస్ ఫైర్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరంపై ఈటల కామెంట్స్ కాకరేపుతున్నాయి. టీవీ9 క్రాస్ ఫైర్లో చెప్పిన కొన్ని అంశాలు బీఆర్ఎస్కు …
Read More »జూనియర్ NTR క్రేజ్ చూసి అసదుద్దీన్ ఒవైసీ షాక్..! MIM మీటింగ్లో పేరు చెప్పగానే దద్దరిల్లిన..
ఒక AIMIM సభలో అసదుద్దీన్ ఒవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంతో సభ దద్దరిల్లిపోయింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ పాపులారిటీకి ఒవైసీ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తన టాలెంట్తో బిగ్ స్టార్గా ఎదిగిన నటుడు. యూత్లో జూనియర్ ఎన్టీఆర్కు ఉండే క్రేజ్ గురించి కొత్త చెప్పేందేముంది కానీ, ఓ మీటింగ్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. …
Read More »గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!
తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఘనంగా ప్రారంభించి …
Read More »డియర్ మినిస్టర్స్.! మాట కొంచెం పొదుపు.. మంత్రులపై టీపీసీసీ సీరియస్..
డియర్ మినిస్టర్స్.. నోట్ దిస్ పాయింట్స్.. మీరు మంత్రులైనంత మాత్రాన అన్నీ మాట్లాడేస్తాం.. పక్క వాళ్ల శాఖలో కలగజేసుకుంటామంటే కుదరదు అంటోంది పీసీసీ. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రులు కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పీసీసీ చీఫ్. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ఎలా ప్రకటన చేస్తారని ఫైర్ అయ్యారాయన.కేబినెట్లో చర్చ జరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడంపై పీసీసీ సీరియస్ అయింది. కోర్టులో ఉన్న అంశాలపై ఎలా పడితే అలా మాట్లాడతారా? ఒకరి శాఖలో మరొకరు …
Read More »కీలక మలుపు తిరిగిన కాలేశ్వరం విచారణ..! మంత్రులతో సీఎం రేవంత్ మీటింగ్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన మలుపు తిరిగింది. కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల నిమిత్తాలను అందించాలని కోరింది. నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చర్చించి అధికారులకు అన్ని వివరాలు కమిషన్ కు అందించాలని ఆదేశించారు.కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలను …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!
రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యూకేషన్లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 210 స్కూల్స్ తో పాటు మరిన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అంటారు. కానీ …
Read More »