తెలంగాణ

పండుగ వేళ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోనే ఉంటుందా..?

సంక్రాంతి నేప‌థ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ద‌మైంది. ఈ పండుగ‌కు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజ‌మాన్యం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఆయా రోజుల్లో ర‌ద్దీ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 19, 20 తేదిల్లో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీకి సంబంధించి త‌గిన ఏర్పాట్లు …

Read More »

ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబద్‌.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు

హైదరాబాద్ ఐటీ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణలో ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నట్లే, ఇప్పుడు ఫార్మా రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ వ్యాపార విస్తరణకు, సమర్థవంతమైన నిర్వహణకు ఈ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఇటీవల, హైదరాబాద్ ఫార్మా జీసీసీలకు కీలక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు ప్రారంభం 700 బిలియన్ డాలర్ల విలువైన లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో ప్రముఖ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం ఎంచుకుంది. మెర్క్ (ఎంఎస్), …

Read More »

పండగకు ఊరెళ్లేవారికి పోలీసులు సూచనలు.. ఫాలో అవ్వకపోతే మీకే నష్టం

తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందరూ ఒక్కచోట ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన చాలా మంది వ్యక్తులు సొంతూర్లకు వచ్చి.. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య చేసుకునే పండగ ఇది. అయితే పండక్కి ఊరెళ్లెవారికి ఓ అలెర్ట్…తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త ఏడాదిలో మొట్టమొదట వచ్చే పండుగ. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరి ఆనందంగా ఉండే సమయం. అందుకే …

Read More »

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 3 రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి కీ డైన్ లోడ్ చేసుకోవచ్చు. ఆనర్స్‌ కీపై అభ్యంతరాలు లేవనెత్తే వారు జనవరి 12, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యంతరాలు ఇంగ్లీషులో మాత్రమే తెల్పవల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధి పేరు, ఎడిషన్, పేజీ నంబర్ వంటి రిఫరెన్స్‌ వివరాలను స్పష్టంగా పేర్కొనవల్సి ఉంటుంది.ఎన్నో రోజుల ఎదురు చూపుల తర్వాత …

Read More »

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా గ్రూప్‌-3 ‘కీ’ విడుదల చేశామని, రెండ్రోజుల్లో గ్రూప్‌ 2 ‘కీ’ కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం స్పష్టం …

Read More »

వెరీవెరీ బ్యాడ్‌న్యూస్.. తెలంగాణ మందుబాబులకు ఎంత కష్టమొచ్చిందో కదా

సంక్రాంతి పండుగ ముందే తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఆ బ్రాండ్ బీర్లు ఇకపై కనిపించవట. రాష్ట్రంలోనే ప్రసిద్ది గాంచిన ఈ బ్రాండ్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకీ ఏ బ్రాండ్ బీర్లు ఆగిపోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..తెలంగాణలో బీర్ల సరఫరాపై కొత్త మలుపు తిరిగింది. కింగ్‌ఫిషర్ బీర్‌ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్)కు సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ లేఖను SEBIకి రాసింది. యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటన ప్రకారం, …

Read More »

ఫార్ములా ఈ రేస్ కేసులో టాప్ గేర్‌లో ఎంక్వైరీ.. విచారణలో సంచలనాలు వెల్లడి!

ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఊపందుకుంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందితులుగా ఉన్న అధికారులను వరుసగా విచారిస్తోంది. హెచ్ఎండీఏ అధికారి బీఎల్‌ఎన్ రెడ్డిపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఇక మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది.తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేస్ ఎంక్వైరీపైనే ఏసీబీ, ఈడీ ఆఫీసులు ఫుల్ …

Read More »

ముంబైలో ఆరు నెల పాపకి HMPV పాజిటివ్.. తెలంగాణాలోనూ గత నెలలో 11 కేసులు

Hyderabad HMPV Cases: కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్ చిన్న పిల్లలకు సోకుతుంది. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో దీని ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.దేశంలో …

Read More »

అరేయ్.. ఎలారా తినేది.. ఈ పన్నీర్ తింటే.. చివరకు కన్నీరు పెట్టాల్సిందే..

నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్​ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే …

Read More »

ఇకపై ఇంటర్మీడియట్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌.. నిఘా నీడలోనే ప్రయోగాలు

ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా.. బైపీసీ విద్యార్థులకు వీటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండానే విద్యార్ధులకు ఫుల్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో..ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలపై ఇంటర్‌ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలోనే ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరగాలని బోర్డు నిర్ణయించింది. ఈ …

Read More »