తెలంగాణ

 నిరుద్యోగుకు గుడ్‌న్యూస్.. 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ …

Read More »

ఛీ.. ఛీ.. ఇలా చేశావేంట్రా దుర్మార్గుడా.. మూసీలో 10 కిలోమీటర్లు వెతికినా లభించని స్వాతి శరీర భాగాలు..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌ గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతిని హత్య చేసిన మహేందర్.. తల, కాళ్లు, చేతులను మూసీలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికినప్పటికీ.. మృతురాలి శరీర భాగాలు లభించలేదు. వరద ప్రవాహానికి శరీర భాగాలు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. మృతురాలి మొండెం ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే ఉంది. ఇప్పటికే నిందితుడు మహేందర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు మేడిపల్లి పోలీసులు. పక్కా ప్లాన్‌తో మర్డర్‌ చేశాడు మహేందర్‌. భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం …

Read More »

ఏఐ టెక్నాలజీతో వీడియోలు క్రియేట్ చేశారు.. ఓయూకు మళ్లీ వస్తా.. ఒక్క పోలీస్ ఉండొద్దు..

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని.. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా అని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. నిజాంకు వ్యతిరేకంగా పీవీ నరసింహారావు.. ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారన్నారు. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్‌లను తెలంగాణకు అందించిన విశ్వవిద్యాలయం ఓయూ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో సమస్య ఏదైనా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు. సోమవారం ఉస్మానియా …

Read More »

సీఎం రమేష్‌ ఇంటికి నేను కూడా వెళ్లా.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై జగదీష్‌ రెడ్డి ఏమన్నారంటే?

బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ వ్యాఖ్యలపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. బీజేపీతో పొత్తుకోసం కేటీర్‌ తమను కలిశారన్న సీఎం రమేష్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీవిలీనంపై సీఎం రమేశ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సీఎం రమేష్‌ ఇంటికి నేనుకూడా వెళ్లానని.. అంత మాత్రానా పొత్తు పెట్టుకున్నట్టా అని ప్రశ్నించారు. సీఎం రమేష్‌ ఇంటి సీసీ ఫుటేజీ బయట పెట్టాలి డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ వ్యాఖ్యలపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. పార్టీవిలీనంపై …

Read More »

అయ్యా..! యూరియా అంటే పట్టించుకోవట్లే.. కట్ చేస్తే ఇది సీన్..

వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే సహకార సంఘాల ఎదుట క్యూ కడుతున్నా యూరియా దొరకకపోవడంతో ఆగ్రహం చెలరేగింది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పరిస్థితి మరింత విషమించింది.యూరియా కొరత రైతులను తీవ్ర స్థాయిలో వేధిస్తుంది. వర్షాలు విస్తారంగా కురవడంతో అన్ని పంటలకు ఇప్పుడు యూరియా అనేది అత్యంత అవసరంగా మారింది. ఉదయం 5 గంటల నుండే రైతులు పలు సహకార సంఘాల వద్దకు చేరుకొని యూరియా కోసం …

Read More »

SBI బ్యాంక్‌లో ఆడిట్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ బుక్‌లో రాసినవి చూడగా..

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్-2లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆడిట్ టీం విచారణలో 4 కోట్ల గోల్‌మాల్ వ్యవహారం బయటపడగా.. మరింత లోతుగా ఆటిట్ చేసిన అదికారులకు కళ్లు బైర్లు కమ్మే అక్రమాల చిట్టా లభించింది. దాదాపు రూ.1.07కోట్ల నగదు, 12.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు( ఐదున్నర కిలోలు) మాయమైనట్లు గుర్తించారు ఆడిటింగ్ టీం. ఈ నగదు, నగల మాయంలో బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కీలక నిందితుడిగా తేల్చారు. మేనేజర్ …

Read More »

ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేసిన తెలంగాణ స్పీకర్.. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ!

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు. స్పీకర్‌ నోటీసులపై గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న …

Read More »

కూకట్‌పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి మరిన్ని నమ్మలేని నిజాలు.. పక్కా ప్లాన్‌తోనే.!

ఒక పదిహేనేళ్ల పిల్లాడు కిరాతకంగా మర్డర్‌ చేస్తాడా? డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడా? పదేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో ఈ కిల్లర్‌ మైండ్‌సెట్‌ ఇప్పుడు షాకింగ్‌గా మారింది? నెత్తురు చూస్తేనే భయపడే వయసులో, ఎలా నెత్తురు పారించాడు? సహస్ర తల్లిదండ్రుల గుండెకోత అందరినీ కలచివేస్తుంటే, ఈ పిల్లవాడి ప్రవర్తన మరోవైపు చర్చనీయాంశంగా మారింది. కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ దే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతులతో …

Read More »

వ‌న‌స్థలిపురం ఏసీబీ రైడ్స్.. రూ. 70వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన స‌బ్ రిజిస్ట్రార్!

అవినీతికి అలవాటు పడిన గుంటనక్కలు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేశాయి. సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్‌ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి జలగలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో స‌బ్ రిజిస్ట్రార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా …

Read More »

6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.. తపాలాశాఖ తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ …

Read More »