తెలంగాణ

సంధ్య థియేటర్ కేసులో మరో కీలక పరిణామం.. దానిపైనే పోలీసుల ఫోకస్..!

సినీ నటులు అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు, స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్య ధియేటర్ ఘటనపై స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్‌ విచారణ కొనసాగుతోంది. థియేటర్‌లో తొక్కిసలాట ఘటనతోపాటు అతర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్‌కు పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ చేపట్టారు. అల్లు …

Read More »

ప్రశ్నల వర్షం.. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న పోలీసులు

అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ప్రశ్నలు..అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన పై స్పందించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దాని …

Read More »

విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే

తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్‌ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న …

Read More »

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టుల్లో కొన్నింటినీ గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటికి నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది..తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ …

Read More »

రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..?

సాగు చేసే వాడికే సాయం అందాలి. అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పించాలంటోంది కాంగ్రెస్ సర్కార్. సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాళ్లు, రప్పలు ఉన్న భూములకు కూడా …

Read More »

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట.. 10 రోజుల వరకు అరెస్ట్‌ చేయొద్దన్న హైకోర్టు

ఫార్ములా -E కేసుపై ACB అడుగులు వేస్తున్నవేళ, కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్‌ పిటిషన్‌కు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్‌ చెప్పడంతో, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి.హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట ‌లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అలగే డిసెంబర్ 30లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన!

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ 2012లో 72 కి.మీ. దూరం..మూడు కారిడార్లుగా మెట్రో మార్గ్‌ను మార్క్‌ చేశారు. నిత్యం లక్షలాది మంది ప్రమాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది హైదరాబాద్ మెట్రో. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి, ఎక్కువ దూరం, తక్కువ సమయంలో చేరుకోవడానికి అనుకూలంగా ఉండటంతో మెట్రోకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతూ వచ్చింది.హైదరాబాద్ మెట్రో రైలు కొద్దికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్‌, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా అందిస్తూ రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది. …

Read More »

రణరంగంగా మారిన తెలంగాణ అసెంబ్లీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు!

ఫార్ములా -E కేసు రచ్చ అసెంబ్లీలో సాగింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళనకు దిగడంతో అధికార-విపక్షాల మధ్య యుద్ధం జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తమకు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్‌.. స్పీకర్‌పై దాడి చేశారంటూ కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగాయిఉదయం రణరంగంగా మారింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోడియం దగ్గర హరీష్‌రావు తోపాటు మరికొందరు …

Read More »

 యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. …

Read More »

హైకోర్టులో ఏసీబీ కేసుపై కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌.. విచారణ ఎప్పుడంటే?

ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, బోజనం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేయాలని కోర్టును కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఏసీబీ ఈ ఫార్మూలా రేసు వ్యవహరంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. …

Read More »