బైక్పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్కు …
Read More »మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..
ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు.. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు.. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గొప్ప …
Read More »మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల …
Read More »హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక నిమజ్జనాలను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భక్తులు తరవచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమజ్జనాలు పూర్తయ్యే వరకు నగరంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగరంలోని హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక …
Read More »రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!
దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండగల సమయాల్లో ప్రయాణికులకు సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందాలనే ఉద్దేశంతో.. పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సేవలను మరో నెలపాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడువును …
Read More »అమ్మవారి ఆలయంలో అద్భుతం.. పూజా సమయంలో భగవతి కంట కన్నీరు.. బారులు తీరిన భక్తులు
ఓ వైపు తెలంగాణాలో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వలన అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితి సమయంలో దేవుడు దయ ఉండాలని భావించిన కొంతమంది భక్తులు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ సేవా సమితి పూజలు చేస్తున్న సమయంలో ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారి కంట కన్నీరు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. …
Read More »ఆరడుగుల బుల్లెట్ నాకు గాయం చేసింది.. తర్వాత మీవంతే రామన్న..
రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మాట్లాడారు.. మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి హరీష్రావు, అలాగే.. సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదంటూ వ్యాఖ్యానించారు. హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ …
Read More »నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. రామన్న వారితో జాగ్రత్త.. కవిత సంచలన వ్యాఖ్యలు..
నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడుతా.. అంటూ కేసీఆర్ కూతురు కవిత పేర్కొన్నారు. జన్మనిచ్చిన తండ్రి చిటికన వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నా.. నాపై ఇద్దరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటి..? హరీష్రావు, సంతోష్రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు.. అంటూ కవిత పేర్కొన్నారు. తనపై కుట్ర జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ స్పందించవద్దా? బీఆర్ఎస్లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి.. అంటూ కవిత …
Read More »ఏపీ ప్రజలారా వినండి..! ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. వచ్చే 3 రోజులు దుమ్ముదుమారం
ఏపీ, తెలంగాణకు వర్షసూచన కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే.. ఏపీలోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. …
Read More »ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు.. జోరుగా రూ.లక్షల్లో లావాదేవీలు! 8 మంది అరెస్ట్..
నగరంలో మరో ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టైంది. SR నగర్లో అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను టాస్క్ ఫోర్స్ (సౌత్) టీమ్ సోమవారం అరెస్ట్ చేసింది. నిషేధిత ఖేలో గేమ్స్ బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ ముఠా ఆన్లైన్ బెట్టింగ్ కోసం పలు రకాల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగిస్తోంది. మారు వ్యక్తుల పేర్లతో యూజర్ ఐడీలు, బ్యాంక్ ఖాతాలను సృష్టించి జోరుగా దందా నిర్వహిస్తున్నారు. అరెస్టయిన నిందితులను జి వినయ్ కుమార్, ఎన్ సాయి వర్ధన్ …
Read More »