పాలిటిక్స్

ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?

అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని గులాబీఅధిష్ఠానం కన్నెర్ర చేసింది. గీతదాటితే, హద్దుమీరితే… కన్నకూతురైనా లెక్కచేయనన్న సంకేతాలు పంపిన గులాబీ దళపతి.. కవితపై బహిష్కరణ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై…. ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధినేత కేసీఆర్‌, ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేశారు. తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్‌ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ …

Read More »

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

BRS సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఆమె పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తూ ఉండటంతో.. అధినేత ఆదేశాల మేరకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.  కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ  నిర్ణయం తీసుకుంది పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలయింది. ఇటీవల కాలంలో …

Read More »

హరీష్‌రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్..! ఎమ్మెల్సీ కవిత ఆరోపణల తర్వాత..

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి హరీష్ రావు కారణమని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, కేటీఆర్ హరీష్ రావును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్‌ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్‌ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ …

Read More »

క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్.. కవితపై చర్యలకు సిద్ధమవుతోందా?

బీఆర్ఎస్‌లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి …

Read More »

 తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఇప్పుడేం జరగనుంది..?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది..! పీసీ ఘోష్‌ కమిషన్‌ కూడా అదే తేల్చింది..! కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇటు సీబీఐ విచారణకు కాషాయపార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారుపార్టీదేనని హస్తం నేతలతో కలసి కమలంపెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే… సీబీఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్న సీబీఐ ఎలా వస్తుంది..? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. …

Read More »

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లేనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు. దమ్ముంటే హరీష్‌, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని …

Read More »

దేశవ్యాప్తంగా తెలుగు వెలగాలంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్

నీలం సంజీవ‌రెడ్డి , పీవీ న‌ర‌సింహ‌రావు, జైపాల్ రెడ్డి ,వెంక‌య్య నాయుడు, ఎన్టీఆర్ వంటి తెలుగు నేత‌లు గతంలో జాతీయ స్థాయిలో కీల‌క పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు వ్యక్తికి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎజెండా, జెండా లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి అంతా మ‌ద్ద‌తివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష‌ రెండో …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నట్టు సీఎం రేవంత్ అన్నారు. ఆ వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై తొమ్మిదిన్నర గంటల సుదీర్ఘ చర్చ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం కేసును …

Read More »

దుమ్ము దుమారమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. మొత్తం ఎన్ని రోజులంటే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది అధికార పార్టీ. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలను సభ సాక్షిగా తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్‌. మరోవైపు కాంగ్రెస్‌ వైఫల్యాలను, బీఆర్ఎస్‌ అవినీతిని అసెంబ్లీలో కడిగేస్తామంటోంది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది …

Read More »

యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ ఆందోళన

తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్‌ ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపగా.. మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ యూరియాపై ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్‌పార్క్‌కు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు …

Read More »