పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది.బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరగనుంది. పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్ …
Read More »జనసేన నేత కిరణ్ రాయల్పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…
జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు ఆడవారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల …
Read More »ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం …
Read More »మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. గత లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ …
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ దళ విజయానికి అసలు కారణం ఇదే!
26 ఏళ్ల తరువాత ఢిల్లీకి రాజా అనిపించుకుంది భారతీయ జనతా పార్టీ. దేశ రాజధానిలో ఊరిస్తున్న విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు కమలనాథులు. కొన్ని నెలల ముందే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. విజయమే లక్ష్యంగా ఢిల్లీ గల్లీల్లో దూసుకుపోయారు.మూడు పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా… దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ …
Read More »ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ సంచలనం.. ఆప్ అధినేత కేజ్రివాల్ ఓటమి
ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ అధినేత కేజ్రీవాల్పై 1200 పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్సింగ్ చేతిలో మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో పార్టీ కీలక నేత.. సత్యేందర్ జైన్ సైతం.. షాకుర్ బస్తీ స్థానంలో ఓడిపోయారు. ఓటమివైపు సాగుతోన్న పార్టీకి అగ్ర …
Read More »కౌంట్ డౌన్ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్కి కేబినెట్లో ఫుల్ టీమ్ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సంవత్సర కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న …
Read More »వైసీపీ అధినేత జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత …
Read More »పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తాడోపేడో.. జాతీయస్థాయి పోరుకు సిద్దం..
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చాలా సీరియస్గా ఉంది భారత రాష్ట్ర సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని తపన పడుతుంది. పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్ను ,లీడర్ షిప్ను కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడగా వాడుకుంటుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు ప్రకటించారు, మరి కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే …
Read More »గర్జించిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు
రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మంచి నీళ్లకు కరువు వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని విమర్శించారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవ్వాలని అధినేత క్యాడర్కు పిలుపునిచ్చారు.ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోహీర్, జహీరాబాద్, ఝారసంగం, మొగుడంపల్లి మండలాల నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్రావు అందరు …
Read More »