పాలిటిక్స్

వైసీపీ అధినేత జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్‌ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత …

Read More »

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తాడోపేడో.. జాతీయస్థాయి పోరుకు సిద్దం..

ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చాలా సీరియస్‌గా ఉంది భారత రాష్ట్ర సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని తపన పడుతుంది. పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్‌ను ,లీడర్ షిప్‌ను కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడగా వాడుకుంటుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు ప్రకటించారు, మరి కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్‌లో ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే …

Read More »

గర్జించిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు

రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మంచి నీళ్లకు కరువు వచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని విమర్శించారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవ్వాలని అధినేత క్యాడర్‌కు పిలుపునిచ్చారు.ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోహీర్, జహీరాబాద్, ఝారసంగం, మొగుడంపల్లి మండలాల నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్‌రావు అందరు …

Read More »

చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు

ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్‌ టైమ్‌ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300009 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు.. 161 రకాల ప్రజలు సేవలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, APSRTC, అన్న క్యాంటీన్, …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీగా ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, …

Read More »

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారం..

భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.. …

Read More »

వైఎస్ జగన్ మార్గంలో అస్సాం సీఎం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.?

ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా ఉన్న అస్సాం తాజాగా మరో 3 రాజధానుల ప్రస్తావనతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి దిస్‌పూర్ (గువాహటిలో ఒక భాగం) రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి, హిమాలయ పర్వత సానువులకు మధ్యన విస్తరించి ఉంటుంది.అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు. హిమాలయాలు, బ్రహ్మపుత్ర నదీ లోయ మధ్య సువిశాలంగా విస్తరించిన అస్సాం రాష్ట్రానికి దిబ్రూగఢ్‌ను రెండవ రాజధానిని చేస్తానని …

Read More »

తెలంగాణ ప్రజలకు పండగలాంటి వార్త.. నేడే అకౌంట్లలో నగదు జమ.. డిటైల్స్ ఇదిగో

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ నాలుగు పథకాలు జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఇవ్వాల్టి (జనవరి 27) నుంచి అమలుకానున్నాయి.. అయితే.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, రైతు కూలీలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మండలానికో గ్రామం చొప్పున మొత్తం 606 గ్రామాల్లో రైతు భరోసా …

Read More »

జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి

జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి జనసేన వారు ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని పవన్ కోరారు. ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన …

Read More »

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి బిగ్‌షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌కి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు రాజీనామా చేశారు. శనివారం బీజేపీలో చేరనున్నారు మేయర్‌ సునీల్‌రావు.  మేయర్‌తోపాటు మరో 10మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సైతం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్‌ సమక్షంలో వీళ్లంతా బీజేపీ గూటికి చేరబోతున్నారు బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు.  BRSలో అవినీతిని భరించలేకే పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. రివర్‌ ఫ్రంట్‌, స్మార్ట్‌ సిటీ.. ఇతర పనుల్లో అవినీతి జరిగిందని..ఆ అవినీతి నేత పేరును త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల అవినీతి చిట్టా …

Read More »