సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. చంద్రబాబు టీచర్గా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్ను స్వీకరించారు. రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. …
Read More »నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం… గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్ష
ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీల్లో 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి.. ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. ఆలస్యమైన నిర్ణయానికి బాధ్యులెవరు? అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది.. అసలు కార్యాచరణ మొదలుపెట్టారా లేదా.. ఇలా అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్రెడ్డి. మంత్రి దగ్గర నుంచి …
Read More »చర్యలా… చర్చలా..? రెబల్స్కి రంగు పడుద్దా?… ఇవాళ గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక భేటీ
ఇవాళ గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశానికి ప్లాన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. భేటీలో ఏం జరుగబోతుంది… ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..? బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా? అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా? లేక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇలాగే వర్థిల్లాలి అంటూ లైట్ తీసుకుంటుందా? ఇలా అనేక క్వశ్చన్మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాన్చకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన …
Read More »బీ కేర్ ఫుల్ తమ్ముళ్లు..! గీత దాటితే మంత్రి పదవి ఉండదు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
బీ కేర్ ఫుల్ తమ్ముళ్లు…! లైన్ క్రాస్ చేశారో ఇక దబిడిదిబిడే..! సబ్జెక్ట్ నేర్చుకోండి.. సబ్జెక్ట్పైనే రాజకీయాలు చేయండి..! కాదుకాడదూ ఇష్టం వచ్చింది మాట్లాడతాం, నచ్చినట్లు చేస్తాం.. అనంటే ఇక రోజులు లెక్కపెట్టుకోండని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం హాట్టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు.. అభివృద్దే లక్ష్యం.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. గీత దాటి ఎవరైనా మాట్లాడితే నెక్ట్స్ డే మంత్రి …
Read More »ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టార్గెట్గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్.. సీఎం చంద్రబాబు సీరియస్!
వైసీపీ నేతలపై తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టార్గెట్గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంత చేసినా వైసీపీ …
Read More »రేవంత్ ఇంటికైనా వెళ్తా.. కేటీఆర్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నంత పనిచేశారు. ముందే చెప్పినట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చారు. రైతు సంక్షేమంపై రేవంత్ సవాల్ను స్వీకరించిన కేటీఆర్ చర్చించేందుకు ప్రెస్ క్లబ్కు రావాలంటూ సీఎంకు ప్రతిసవాల్ విసిరారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. మంత్రులెవరైనా వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రైతులకు 9రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామని.. రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, బీజేపీ దమ్ముంటే చర్చకు రావాలంటూ తొలుత సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సవాల్కు …
Read More »ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్… రాజకీయ దుమారం రేపుతున్న రమేష్ ఆత్మహత్య
ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నెలకొంది. కాంగ్రెస్ vs BRS వార్గా మారింది రమేష్ అనే యువకుడి ఆత్మహత్య. పోటాపోటికి నిరసనలకు పిలుపునిచ్చాయి ఇరుపార్టీలు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతున్నది. నేడు బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. BRSను అడ్డుకునేందుకు చలోములుగుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేడు మంత్రుల పర్యటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా …
Read More »వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు… వనమహోత్సవంలో సీఎం కీలక వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ కీలకవ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని రేవంత్ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు. రాంజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి …
Read More »అంగన్వాడీ కేంద్రాల్లో జొన్నలతో చేసిన ఆహారం అందిచేందుకు ప్రభుత్వం కసరత్తు..!
తెలంగాణ అంగన్వాడీల్లో త్వరలో జొన్న రొట్టెలు, ఇతర పోషకాహారాలు అందించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక మోడల్ను అధ్యయనం చేసేందుకు సెర్ప్ బృందం అక్కడికి వెళ్లనుంది. మహిళా సంఘాల ద్వారా జొన్నలతో చేసిన ఆహారం సరఫరా చేయాలని కసరత్తు చేస్తోంది. అటు పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు జొన్న సాగుకు ఇది కొత్త ఊపునిచ్చే అంశం. తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం అందిస్తున్న పోషకాహారంతో పాటు జొన్నతో తయారయ్యే రొట్టె, ఇతర పదార్థాలను అందించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే …
Read More »మహా పాలిటిక్స్లో సూపర్ సీన్.. 20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు..
మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాకుండా ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరు అనుకుంటున్నారా..? ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిశారు. దీంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. …
Read More »