బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్లున్నారు..! బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్ట్ 5 నుంచి …
Read More »ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. నాగార్జున సాగర్ వెళ్లకుండా సైడ్ అయిన మంత్రి కోమటిరెడ్డి
నేను ఏమైనా ఆయనకు సబ్ ఆర్డినేట్ నా? ఆయన ఎన్నిగంటలు ఆలస్యంగా వచ్చినా ఎదురు చూడలా..? నేనూ మంత్రినే.. నాక్కూడా ఆత్మగౌరవం ఉంది. కనీసం లేట్గా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం నాగార్జునసాగర్ పర్యటన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోపం వచ్చింది. ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. అంటూ ఇంటికి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నేను ఏమైనా ఆయనకు సబ్ ఆర్డినేట్ నా? ఆయన ఎన్నిగంటలు …
Read More »కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్.. టీడీపీ నేతలకు సినిమా చూపిస్తామన్న జగన్..
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎవరైన వేధిస్తే కార్యకర్తలు ఈ యాప్లో ఆ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార – విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. వేధింపులకు గురిచేస్తున్నారనేది వైసీపీ వాదన. తాము …
Read More »స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్ టికెట్… బైపోల్ అభ్యర్థిపై పొన్నం కీలక వ్యాఖ్యలు
జూబిలీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్ టికెట్ దక్కుతుదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాగ్రెస్ నేత అజారుద్దీన్తో కలిసి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్ లేదని పొన్నం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్లో ఇప్పటికే …
Read More »ఇరకాటంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు? గ్రూప్ 1 ఫలితాలు ఎంత పనిచేశాయ్..
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా ఏర్పడిన 32 మండలాలకు సైతం ఇప్పటి వరకు ఎంపీడీవో పోస్టులు మంజూరు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు …
Read More »నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం… స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ
తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధివిధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. — ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైనా చర్చించే …
Read More »బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ – సస్పెన్స్ ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాల కోసం పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఈ దిశగా పంచాయతీరాజ్ చట్టం, 2018కి సవరణలు చేయాలని నిర్ణయించి, తగిన ఆర్డినెన్సు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదానికి జులై 15న పంపించారు. అయితే గవర్నర్ జిష్ణదేవ్ పర్మ ఆ ఫైల్ను సమగ్రంగా పరిశీలించి, …
Read More »మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు… శ్రీకాంత్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. స్కామ్ల మీద స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి. వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై రెండు నెలలుగా జైలులోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో.. ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమేనని అనుచరులే అనుకుంటున్నారు. ఇదే మైనింగ్ కేసు మరికొంత మంది నేతల చుట్టూ తిరుగుతుండటం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన …
Read More »ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?
ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సొంత ఇంటి పార్టీలో సమస్యలకు కారణం ఇంటి వాస్తు బాగా లేకపోవడమేనా? కవిత ఇంటిలో జరుగుతున్న మార్పులు ఏంటి..? ఇంటి వాస్తు.. ఇది చాలామంది నమ్మకం. ఈ వాస్తు బాగుంటేనే మనకు మంచి జరుగుతుంది అని.. తాము చేసే అన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తామని నమ్ముతూ ఉంటారు. అందులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్సీ కవిత కూడా …
Read More »తెలంగాణ రాజకీయాల్లో చిట్ చాట్ చిటపటలు… కౌంటర్.. రీకౌంటర్లతో ఢీ అంటే ఢీ
తెలంగాణ రాజకీయాలకు చిట్చాట్ మంటలు అంటుకున్నాయి. గంజాయ్ బ్యాచ్ అంటూ అధికారపక్షం విపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే… డైవర్ట్ రాజకీయాలు అస్సలొద్దు. దమ్ముంటే నిరూపించూ అంటూ విపక్షం అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. అసలే తెలంగాణ రాజకీయాలు బనకచర్ల ఇష్యూతో భగభగ మండుతున్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం అన్నట్లుగా చిట్చాట్ చిటపటలు కూడా అంటుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ ను గంజాయి బ్యాచ్తో పోల్చడంతో వివాదం రాజుకుంది. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని, …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal