పాలిటిక్స్

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే డబుల్‌ పవర్‌ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్‌ పవర్‌ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు. ఇక్కడ శక్తివంతమైన సర్కార్‌ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉంటే.. మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ పవర్‌ …

Read More »

వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖ‌పై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో స‌మీక్ష నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణ‌లో విద్యా వ్యవ‌స్థను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. అద‌న‌పు క‌లెక్టర్లు వారంలో క‌నీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాల‌ల నుంచి ప్రభుత్వ పాఠ‌శాలల్లో 48 వేల మంది చేరార‌ని అధికారులు సీఎం …

Read More »

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్‌కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. …

Read More »

పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

కాంగ్రెస్ అంటేనే నిలదీతలు.. నినాదాలు కామన్‌. కానీ మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఇవేవీ కనిపించలేదు. అంజన్‌ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే.. జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం హాట్‌గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజికవర్గమంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్నారాయన. …

Read More »

లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

నీట ముంచినా.. పాల ముంచినా మంత్రులదే బాధ్యత.! ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క. పరిస్థితిని సీరియస్‌గా తీసుకోకుంటే ఏ పరిణామాలకైనా బాధ్యత వహించాల్సిందే. ఇదీ క్లుప్తంగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్‌. అలాగే గట్టుదాటిన పార్టీ నేతలను కూడా ఇకపై ఉపేక్షించేంది లేదని హెచ్చరికలు జారీ చేశారు.18 నెలల పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..స్థానిక ఎన్నికల రూపంలో త్వరలో అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. దీంతో పరిపాలన వ్యవస్థను సెట్‌రైట్‌ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే మూడు …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందిన సర్పంచ్‌ల పిటిషన్‌ దాఖలైంది. గత ఏడాది అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్‌ల పదవి కాలం ముగిసింది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్‌ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలని ఇటీవల …

Read More »

ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌-2025కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను రూపొందించింది. CRDA సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేసింది. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా అనేక సంస్థలు వస్తాయని మంత్రి పార్థసారథి తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో గుర్తించిన భూములన్నింటికీ ఒకే విధానం ఉంటుందన్నారు. …

Read More »

కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం అధికార కాంగ్రెస్‌లో పానిపట్టు యుద్దమే జరుగుతోంది. ఏకంగా అరడజను మంది బీఫామ్ కోసం క్యూకట్టారు. పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేయడం ఆసక్తిగా మారింది. దీనిపై టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.. అదేం కుదరదు. ఇంకా ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికివ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజహరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి …

Read More »

ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లొకేష్‌ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు.ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ రాష్ట్రానికి సంబంధించిన …

Read More »

కేసీఆర్ ప్రభుత్వం, షర్మిలమ్మ పోన్ ట్యాప్ చేసిందా..? వైఎస్ జగన్ తొలి స్పందన ఇదే!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్‌, జగన్‌ కలిసే ఆ ఇన్ఫర్మేషన్‌ను షేర్‌ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను ట్యాప్‌ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల …

Read More »