ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, అడ్డుకుంటే తొక్కేస్తామని ప్లకార్డులు ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ను “నాటకాల రాయుడు” అని పిలుస్తూ, ఆయన రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పొదిలి టూర్ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో …
Read More »తెలంగాణలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్
మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేసీఆర్, కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న వేళ.. రాజకీయంగా తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ మంత్రులతో సీఎం సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల …
Read More »కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్
తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి …
Read More »వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహిళా నేత!
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి నిరంతర షాక్లు తగులుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవులకు రాజీనామా చేసి జకియా ఖానుం వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తిరుమల దేవస్థానం VIP టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు, కూటమి నేతలతో జకియా సమావేశాలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో …
Read More »మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీలో చేరేందుకు మంతనాలు..!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ విశ్వసనీయ సమాచారం అందుతోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నాయి. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. ఏపీ రాజ్యసభ రేసులో లేనని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.. విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు ఆయన …
Read More »సై అంటే సై అంటున్న బీజేపీ-ఎంఐఎం.. 22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక!
22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ వార్ వైపేనే నెలకొంది. బలాబలాల్లో మజ్లిస్కు మొగ్గు ఉన్నా.. వార్ వన్ సైడ్ కాదంటోంది భారతీయ జనతా పార్టీ. ఇంతకీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతోంది? గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది? అన్నదీ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం. కానీ ఇప్పుడలా కుదరదంటూ బరిలోకి దిగింది భారతీయ …
Read More »తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది..? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్..
తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్ టాపిక్గా మారింది.తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం …
Read More »తెలంగాణలో పొలిటికల్ వార్.. ప్రకంపనలు సృష్టిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు!
మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..అనే మాట కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే.. జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా?..చెట్టుకు కట్టేసి బట్టలూడదీసి కొడతారంటూ ప్రతిపక్షాలకు గట్టి వార్నింగే ఇచ్చారు.ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి …
Read More »నల్గొండ కాంగ్రెస్లో కార్చిచ్చు.. హైకమాండ్కు తలనొప్పిగా మారిన కేబినెట్ కూర్పు!
కాంగ్రెస్ పార్టీకి, నల్గొండ జిల్లాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకు తగ్గట్టే.. ఈ జిల్లా నుంచి ఉద్ధండ నాయకులు పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుంటారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో.. పెద్ద తలకాయలుగా చలామణి అవుతుంటారు. జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రాంరెడ్డి దామోదర్రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే బడా లీడర్ల పేర్లకు ఇక్కడ కొదవుండదు. అదంతా ఒకెత్తయితే.. జిల్లాలో ఈ హేమాహేమీల మద్య అస్సలు పొసగకకపోవడం ఒకెత్తు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఇక్కడి నాయకులతో ఇదో తలనొప్పి. కాంగ్రెస్ అధికారంలోకి …
Read More »వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్.. ఎస్.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి రోజు సమావేశంలో ఏపీ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు గతానికి భిన్నంగా జరిగింది. సుదీర్ఘ ప్రజంటేషన్లు, పేజీలకు పేజీల …
Read More »