బిజినెస్

పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

మగువలు పసిడి ప్రియులు. పండగలు, ఫంక్షన్లకు ఒంటినిండా బంగారు నగలు ధరించి మురిసిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు కొండెక్కి కూర్చోవడంతో గోల్డ్‌ కొనలేని పరిస్థికి వచ్చింది. కానీ బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) స్పష్టం చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే మరింతగా దిగొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు శుభశూచకంగా మంగళవారం (జులై 16) బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 …

Read More »

జియోలో దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

రిలయన్స్‌ జియోలో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఇటీవల మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను భారీగా పెంచగా, చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్లారు. మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఇప్పుడు తక్కువ ధరల్లోనే ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌ ఏంటో తెలుసుకుందాం.. కొన్ని రోజుల క్రితం TRAI అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, SMS లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్‌ ఈ నియమం తర్వాత …

Read More »

మై హోమ్ ఇండస్ట్రీస్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్.. ఏ రంగంలో అవార్డు వచ్చిందంటే..?

కస్టమర్లకు నాణ్యమైన సిమెంటును అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న మహా సిమెంట్‌కు అవార్డుల పంట పండుతుంది. సున్నపురాయి గనుల నిర్వహణలో జాతీయస్థాయిలో మహా సిమెంట్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ ఎండీ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఈ అవార్డులను అందుకున్నారు. సిమెంట్ రంగంలో రారాజుగా నిలుస్తోంది మహా సిమెంట్. సిమెంట్ తయారీలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు మై హోమ్ ఇండస్ట్రీస్‌కు అవార్డులు వస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట …

Read More »

ఇక ఇండియాలోనే.. అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్‌తో డిఫెన్స్ దద్దరిల్లాల్సిందే

IAF అవసరాలకు అనుగుణంగా మల్టీ- రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ లో భాగంగా మొత్తం 114 Su-35M ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న Su-30MKIతో పోల్చితే.. Su-35Mలో దాదాపు 70-80% సాంకేతిక సామాన్యత ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కాదు.. సైనిక శక్తిలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. భారత్‌తో సరిహద్దులు పంచుకుంటూ శత్రువైఖరిని ప్రదర్శిస్తున్న చైనా, పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే 5వ తరం యుద్ధ విమానాలను కలిగి ఉండగా.. …

Read More »

హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ప్రకటనలో తెలిపారు. 10.07.2025 నుంచి కాచిగూడ – యశ్వంత్‌పూర్ …

Read More »

తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్‌ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన

తెలంగాణలో మహిళల అభివృద్ధిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల సక్షేమానికి పెద్దపీట వేస్తూ కొత్త స్టాంపు డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఈ క్రమంలో …

Read More »

8 రోజులు, 5 దేశాలు.. దశాబ్దంలోనే సుదీర్ఘ విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనకు బయలుదేరనున్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ చేస్తున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలోని ప్రధాన ఉద్దేశ్యం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని …

Read More »

భారత్‌కి ఇబ్బంది లేదు.. వేరే మార్గాల్లో క్రూడాయిల్.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన

ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ కావడం- గేమ్‌ఛేంజర్‌ అవుతుందా? దాడులు చేసిన తర్వాత, ట్రంప్‌ శాంతిమంత్రం జపించినా, అంతా కూల్‌ అవుతుందా? ప్రపంచం మీద ఇరాన్‌ కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. క్రూడాయిల్‌ సరఫరా ఆపేస్తామంటే చాలు, మనం హడలిపోతాం.. ఎందుకంటే, క్రూడాయిల్‌ సరఫరాను ఇరాన్‌ ఆపేస్తే, అంతర్జాతీయంగా సమస్య వస్తుంది. ఒకవైపు హార్ముజ్‌ జలసంధి మార్గం మూసివేత.. మరోవైపు క్రూడాయిల్‌ నిలిపివేతతో.. ధరలు అమాంతం పెరిగితే, మనదేశంలోనూ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ …

Read More »

ఆ దేశ ప్రధానికి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ..! ఎందుకంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా పర్యటనలో ఉన్నారు. క్రొయేషియాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రొయేషియా అధ్యక్షుడు, ప్రధానమంత్రికి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విలువైన హస్తకళలను బహుమతిగా ఇచ్చారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిశా నుండి పట్టచిత్ర పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్ నుండి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రపతికి ‘పట్టచిత్ర పెయింటింగ్’ క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్ కు ఒడిశా నుంచి వచ్చిన సాంప్రదాయ పట్టచిత్ర పెయింటింగ్ ను ప్రధాని మోదీ …

Read More »

టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష

బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …

Read More »