బిజినెస్

ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌. రిజిస్ట్రేషన్‌ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్‌ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్‌ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల …

Read More »

తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో అగ్రగామిగా అవతరిస్తుందని, వ్యవసాయం, డెయిరీలో ఎంతో స్కోప్‌ ఉందంటున్నారు. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయిపెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం …

Read More »

 తెలంగాణకు మరో రూ.45,500 కోట్ల పెట్టుబడులు.. సన్ పెట్రో కెమికల్స్‌తో కీలక ఒప్పందం

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో సారి భారీ పెట్టుబడులను ఆకర్షించి కొత్త రికార్డు సాధించింది. ఇంధన రంగంలో ప్రముఖ సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. ఇవి 5,440 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తు …

Read More »

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి.సంక్రాంతి సీజన్‌ అంటే.. అందరికీ పండగే. సామాన్యులకు భక్తి.. వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్‌ సీజన్‌ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్‌ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. …

Read More »

థర్డ్‌ పార్టీ యాప్‌ అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!

వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరికి ఒక సాధనంగా మారింది. రకరకాల ఫీచర్స్‌తో ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది వాట్సాప్‌. ఎవరైనా డాక్యుమెంట్‌ని పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు, ముందుగా అది మరొక యాప్ సహాయంతో స్కాన్ చేసి పంపుతుంటారు..వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. Meta యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకువస్తుంటుంది. వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు వినియోగదారులు డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడానికి థర్డ్-పార్టీ …

Read More »

భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? వారి సంపద ఎంతో తెలుసా?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు.భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద రూ.1,630 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా …

Read More »

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!

Budget-2025: మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారి టేక్ హోమ్ ఆదాయం పెరుగుతుంది. దీంతో వారికి ఎంతో ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది..మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం నుంచి పెద్ద ఊరట లభించనుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వార్షిక ఆదాయంపై రూ.15 లక్షల వరకు పన్ను బాధ్యతను తగ్గించవచ్చని నివేదికలు ఉన్నాయి. 1 ఫిబ్రవరి 2025న సమర్పించే రాబోయే బడ్జెట్‌లో దీనిని …

Read More »

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు బాగా పెరిగాయి. ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపులు బాగా పెరిగాయి. యూపీఐ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా మారింది. యూపీఐ ద్వారా కొనుగోలుదారుల బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారులు, వ్యక్తులకు రియల్‌టైమ్ చెల్లింపులను అనుమతిస్తుంది.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపుల సాధారణ పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.1,00,000గా నిర్ణయించింది . అయితే అన్ని బ్యాంకులు వినియోగదారులను …

Read More »

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ పెంచడంతో వినియోగదారులు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్‌ …

Read More »

వామ్మో! జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏంటంటే?

బ్రయాన్ ఆడమ్స్ కాన్సర్ట్‌లో వాటర్ బాటిళ్ల విక్రయానికి సంబంధించి హైదరాబాద్ టెక్కీ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను 100 రూపాయలకు విక్రయిస్తుందని చెప్పడమే ఈ పోస్ట్ సారాంశంహైదరాబాద్ కు చెందిన పల్లబ్ దే ఐటీ ఉద్యోగి. ఇటీవల అతను బ్రయాన్ ఆడమ్స్ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. ఆ …

Read More »