బిజినెస్

8 రోజులు, 5 దేశాలు.. దశాబ్దంలోనే సుదీర్ఘ విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనకు బయలుదేరనున్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ చేస్తున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలోని ప్రధాన ఉద్దేశ్యం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని …

Read More »

భారత్‌కి ఇబ్బంది లేదు.. వేరే మార్గాల్లో క్రూడాయిల్.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన

ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ కావడం- గేమ్‌ఛేంజర్‌ అవుతుందా? దాడులు చేసిన తర్వాత, ట్రంప్‌ శాంతిమంత్రం జపించినా, అంతా కూల్‌ అవుతుందా? ప్రపంచం మీద ఇరాన్‌ కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. క్రూడాయిల్‌ సరఫరా ఆపేస్తామంటే చాలు, మనం హడలిపోతాం.. ఎందుకంటే, క్రూడాయిల్‌ సరఫరాను ఇరాన్‌ ఆపేస్తే, అంతర్జాతీయంగా సమస్య వస్తుంది. ఒకవైపు హార్ముజ్‌ జలసంధి మార్గం మూసివేత.. మరోవైపు క్రూడాయిల్‌ నిలిపివేతతో.. ధరలు అమాంతం పెరిగితే, మనదేశంలోనూ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ …

Read More »

ఆ దేశ ప్రధానికి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ..! ఎందుకంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా పర్యటనలో ఉన్నారు. క్రొయేషియాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రొయేషియా అధ్యక్షుడు, ప్రధానమంత్రికి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విలువైన హస్తకళలను బహుమతిగా ఇచ్చారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిశా నుండి పట్టచిత్ర పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్ నుండి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రపతికి ‘పట్టచిత్ర పెయింటింగ్’ క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్ కు ఒడిశా నుంచి వచ్చిన సాంప్రదాయ పట్టచిత్ర పెయింటింగ్ ను ప్రధాని మోదీ …

Read More »

టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష

బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …

Read More »

గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు! ప్రధాని మోదీ హర్షం

ప్రధానమంత్రి మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా, గుజరాత్‌లోని GIFT సిటీలో సైప్రస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), సైప్రస్ ఎక్స్ఛేంజ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇది GIFT సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుంది.గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ఎక్స్చేంజ్‌ ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు మన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు, టర్కీ ఎక్స్చేంజ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. సైప్రస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. …

Read More »

జాక్‌పాట్ కొట్టిన భారత్.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా తరహా చమురు నిక్షేపాలను ఉన్నాయని భారత్ కనుగొంది. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దీని కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. గయానాలో కనుగోన్నంత పెద్ద మొత్తంలోనే.. అండమాన్ ప్రాంతంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయని.. అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3.7 …

Read More »

దూకుడుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్

తెలంగాణలో స్థిరాస్తి రంగం మళ్లీ ఊపందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం 17.72 శాతం వృద్ధి నమోదైంది. దీనితో ఈ రంగం పుంజుకుంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది పోలిస్తే గణనీయమైన వృద్ధి 2023, 2024లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ప్రభావంతో స్థిరాస్తి రంగం కొంత మందగించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, ప్లాట్ల కొనుగోలు, …

Read More »

నేడు కాకతీయ వాసరత్వ సంపద, శిల్పాకళ సందర్శనకు అందగత్తెలు.. వాహ్ వరంగల్ అనేలా ఏర్పాట్లు.

కాకతీయుల వారసత్వ సంపద, శిల్పకళా వైభవాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు.. ప్రపంచ సుందరీమణుల సందర్శన కోసం కాకతీయ శిల్ప సంపదకు నిలయమైన రామప్ప ఆలయం, వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. అందగత్తెలు అబ్బురపోయేలా వాహ్ వరంగల్ అనేలా ఆ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు ఇప్పుడు నయా లుక్ తో వెలిగి పోతున్నాయి..వరంగల్ జిల్లాలో ఈ రోజు ప్రపంచ అందాల సుందరిమణులు రెండు టీములుగా పర్యటించనున్నారు.. గ్రూపు- 1 టీమ్ లో22 మంది, గ్రూప్-2లో 35 మంది …

Read More »

వావ్‌.. వాటే ఐడియా గురూ.. సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్

ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. మొక్కల అద్దె సేవలు! ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది? ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు. ఈ పర్యావరణ హిత ఆలోచన గురించి పూర్తిగా తెలుసుకోండి!మొక్కల అద్దె.. ఒక్క క్లిక్‌తో మీ ఇంటికి మొక్కలు డెలివరీ! Ugaoo, Greenly లాంటి వెబ్‌సైట్లు, స్థానిక …

Read More »

రైతులకు శుభవార్త.. ఈనెల 24న పీఎం కిసాన్‌ డబ్బులు.. వీరికి మాత్రం రావు!

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 24న పీఎం కిసాన్‌ నిధులు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాకు డబ్బులు బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు 18వి విడత రాగా, ఇప్పుడు 19వ విడత అందుకోనున్నారు..  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలో 19వ విడత ఫిబ్రవరి 24 సోమవారం విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర …

Read More »