బిజినెస్

NCLAT: 2 రోజుల్లో 35 శాతం కుప్పకూలిన స్టాక్.. ఒక్కసారిగా అప్పర్ ‌సర్క్యూట్.. దివాలాపై వెనక్కి..!

Coffee Day Shares: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు భారీ ఊరట లభించింది. కంపెనీ దివాలా ప్రాసెస్ ప్రారంభించాలని NCLT ఇచ్చిన తీర్పుపై అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే విధించడంతో ఊపిరి పీల్చుకుంది. కేఫ్ కాఫీ డే పేరిట కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కేసుకు సంబంధించి.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు నేషనల్ కంపనీ లా ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వగా.. తాజాగా దీనిపై అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) బుధవారం రోజు స్టే విధించింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, …

Read More »

అమ్మకానికి ప్రముఖ బ్యాంకు.. ఎస్‌బీఐ వాటా విక్రయం.. ఏకంగా రూ. 18 వేల కోట్లు!

SBI Yes Bank Stake Sale: భారత్‌లోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన.. యెస్ బ్యాంకులో మెజార్టీ వాటా చేతులో మారబోతోందని తెలుస్తోంది. ఇక దీంట్లో మెజార్టీ వాటా కొనేందుకు జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) ఆసక్తి చూపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. SMBC గ్లోబల్ సీఈఓ అకిహిరో ఫుకుటోమీ.. ఈ వారంలో భారత పర్యటనలో భాగంగానే యెస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ట్రాన్సాక్షన్ (డీల్) కోసం ఫుకుటోమీ.. రిజర్వ్ బ్యాంక్ …

Read More »

మార్కెట్లలోకి ఫస్ట్ క్రై గ్రాండ్ ఎంట్రీ.. రతన్ టాటా, సచిన్ టెండుల్కర్‌కి కోట్లలో లాభాలు!

IPO Price: ఫస్ట్ క్రై బ్రాండ్ మాతృసంస్థ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఐపీఓ అదరగొట్టింది. తమ ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలు అందించింది. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్‌ లో 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది. ఐపీఓ ఇష్యూ గరిష్ఠ ధర రూ. 465గా నిర్ణయించగా 40 శాతం ప్రీమియంతో రూ.651 వద్ద మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. దీంతో ఐపీఓ షేర్లు పొందిన వారికి తొలి రోజే భారీ లాభాలు అందినట్లయింది. మరోవైపు.. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో ఈ షేర్లు 34.4 శాతం ప్రీమియంతో …

Read More »

అదరగొట్టిన ఐపీఓలు.. తొలిరోజే 140 శాతం పెరిగిన షేరు.. ఒక్క లాట్‌పై ఏకంగా రూ. 21 వేల లాభం

మార్కెట్ల లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని ఐపీఓలు మంచి లాభాల్ని అందిస్తుంటాయి. లిస్టింగ్‌తోనే భారీగా పెరుగుతుంటాయి. ఇటీవల మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టాక్ ఫ్లాట్ లిస్టింగ్ అయినప్పటికీ.. తర్వాత వరుసగా 3 సెషన్లు 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 79 వేల 500 …

Read More »

ఎస్బీఐ నుంచి కొత్త స్కీమ్.. ఒక్కరోజే ఛాన్స్.. కనీసం రూ. 500 పెట్టుబడితో షురూ..

పెట్టుబడులు పెట్టేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇలా చాలా ఉంటాయి. అయినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపైనా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటారు. ఇక్కడ సిప్ అంటే నెలనెలా కొంత మొత్తం పెట్టుబడి ద్వారా మంచి రిటర్న్స్ అందుకుంటారు. ముఖ్యంగా కాంపౌండింగ్ (చక్రవడ్డీ) కారణంగా దీంట్లో అసలు పెట్టుబడికి ఎన్నో …

Read More »

దిగ్గజ సంస్థ దివాలా.. కుప్పకూలుతున్న షేర్లు.. ఒక్కరోజులోనే 20 శాతం పతనం.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం!

Coffee Day Shares: కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కేఫ్ కాఫీ డే పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తోంది. కేఫ్ కాఫీ డే.. రూ. 228.45 కోట్లు చెల్లించడంలో విఫలమైందని ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఇలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ అప్పుల్లో …

Read More »

మార్కెట్లు పడుతున్నా అదరగొడుతున్న ఓలా.. మళ్లీ ఒక్కరోజే 20 శాతం పెరిగిన షేరు.. కాసుల పంట!

Stock Market Live Updates: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్, ఆమె భర్తపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచేందుకు దోహదపడిన అంతర్జాతీయ ఫండ్లలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ దంపతులకు వాటాలున్నాయని ఈ సంస్థ ఆరోపించింది. వీటిని ఇరువురూ ఖండించారు. ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. అయినప్పటికీ హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సోమవారం సెషన్ …

Read More »

వరుసగా పెరిగి ఒక్కసారిగా ఇలా.. లేటెస్ట్ బంగారం, వెండి ధరలివే.. తులం గోల్డ్ ఎంతంటే?

Hyderabad Gold Rates: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారత మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఎక్కువగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ సమయాల్లో కొనుగోలు చేసి ధరిస్తుంటారు. దీంతో డిమాండ్ కూడా అప్పుడు భారీగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో మాత్రం ఈ డిమాండ్‌తో పెద్దగా పని లేకుండానే ఇతర కొన్ని కారణాలతో గోల్డ్ రేట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతకుముందు …

Read More »

అదానీ గ్రూప్‌లో సెబీ చీఫ్‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Sebi Chief: గతేడాది మొదట్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు గుప్పించి వార్తల్లో నిలిచిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. తాజాగా మరోసారి అదే పని చేసింది. శనివారం ఉదయం ట్విటర్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర ఉత్కంఠను రేపింది. సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్వీట్ చేయడంతో.. గతంలో అదానీ కంపెనీపై పడి భారత స్టాక్ మార్కెట్లను కకావికలం చేసిన ఆ సంస్థ ఇప్పుడు ఏ కంపెనీపై పడనుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఆ …

Read More »

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. …

Read More »