ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా …
Read More »రేపే నాగ పంచమి.. సర్ప దోషం సహా గ్రహ దోషాలు తొలగేందుకు పూజా శుభ సమయం ఎప్పుడు? ఎలా పూజించాలంటే
శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు పాములను, శివుడు, సుబ్రమణ్యస్వామిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది నాగ పంచమి పండగను రేపు ( 29 జూలై 2025) జరుపుకోనున్నారు. ఈ రోజున ఎలా పూజ చేయడం వల్ల కాల సర్ప దోషం, సర్ప భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నాగ పంచమి పూజ ప్రాముఖ్యత, పూజ శుభ సమయాన్ని తెలుసుకోండి. శ్రావణ మాసంలోని ప్రతి రోజునూ హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. అయితే …
Read More »తక్కువ ధరకే పాండురంగడు, మహా లక్ష్మి సహా ప్రముఖ క్షేత్రాల దర్శనం.. టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటన
శ్రీ మహా లక్ష్మి కొలువైన క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటి కొల్హాపూర్. పంచగంగ నదీ తీరాన ఉన్న ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఇక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా, శక్తిరూపంగా భక్తులతో పూజలను అందుకుంటుంది. అటువంటి విశేష ప్రాముఖ్యత ఉన్న కొల్హాపూర్ కి వెళ్ళాలనుకునే భక్తులకు తెలంగాణా RTC స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ రోజు ఈ టూర్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. …
Read More »భయపెడుతున్న భవిష్యవాణి.. మహమ్మారి ముప్పు, అగ్నిప్రమాదాలు ఎక్కువే..
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తానని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారు. ప్రతి సారి …
Read More »ఆధ్యాత్మిక క్షేత్రం లాల్దర్వాజా.. సింహవాహిని ఆలయ 117వ వార్షికోత్సవాలు..ఎప్పుడంటే.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ ఆషాడం బోనాలు. పట్నమంతా లష్కర్ బోనాల సందడి నెలకొంది. ఆషాడం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని అమ్మవారి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, తీరు తీరు రంగులతో అందంగా అలంకరించారు. హైదరాబాద్ బోనాల్లో ప్రత్యేకమైనది పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారు. ఈ ఆలయం 117 వ వార్షికోత్సవాలు జులై 11నుండి ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతి యాదవ్ ఉత్సవ …
Read More »ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు..
ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదిక కీలక ట్వీ్ట్ చేశారు. ఈ గురు పూర్ణిమ రోజున, మీ అంతర్గత శ్రేయస్సు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. మీరు సాధన చేయండి, ధ్యానం చేయండి, మీ మనస్సును ఒక అద్భుతం చేయండి.. మీ గురువు అనుగ్రహం మీతో ఉంటుంది.. …
Read More »ఒక్క దాడి.. తెలుగు రాష్ట్రాల మధ్య వేడి.. రాముడి భూమిలో రణరంగం..
ఏపీలో విలీనం కారణంగా… భద్రాద్రి రాముడితో పాటు భద్రాచల వాసులకూ కష్టాలొచ్చి పడ్డాయి. రోజూ పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ డంప్ చేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఎందుకంటే భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న నాలుగు రెవెన్యూ గ్రామాలతో పాటు ఒక పంచాయతీని ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం పట్టణాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచి, చుట్టుపక్కల ప్రాంతాలను ఏపీలో కలిపారు. అలా ఏపీలో కలిపిన ప్రాంతాల్లో ఒకటే పురుషోత్తపట్నం.. అసలు అలజడంతా జరుగుతున్నదీ అక్కడే. రెండేళ్ల క్రితం.. సరిగ్గా చెప్పాలంటే 2023 అక్టోబర్లో భద్రాచలం …
Read More »హైదరాబాద్ చేరువలో వెలిసిన కైలాసం.. నీటి గుహను దాటి శివయ్య దర్శనం..
భూకైలాశ్ దేవాలయం.. హైదరాబాద్ నుంచి దాదాపుగా 110 కి.మీ. దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం. భాగ్యనగరం నుంచి కేవలం ఒక్క రోజులో వెళ్లి రావచ్చు. మరి ఈ దేవాలయం విశిష్ట ఏంటి.? ఇక్కడికి ఎలా చేరుకోవాలి.? ఖర్చు ఎంత అవుతుంది.? తాండూరు పట్టణానికి సమీపంలో ఉన్న భూకైలాశ్ దేవాలయం దాని అద్భుతమైన నిర్మాణం. దీని ప్రత్యేకతల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవి ఒక ప్రత్యేకమైన జలాల మధ్య ఉంచబడ్డాయి. భక్తులు ఈ …
Read More »ఇషా ఫౌండేషన్ను సందర్శించిన కేంద్ర మంత్రి జువల్..! గ్రామీణాభివృద్ధిలో ఇషా కృషికి ప్రశంసలు..
ఇషా ఫౌండేషన్ మద్దతుతో తమిళనాడులోని గిరిజన మహిళలు ఆర్థికంగా స్వతంత్రులై, పన్నులు చెల్లిస్తున్నారు. రూ.200లతో ప్రారంభించిన వ్యాపారాలు కోట్లలో టర్నోవర్ను సాధించాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువెల్ ఓరం ఈ మహిళల ప్రగతిని ప్రశంసించారు. ఇషా ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఇషా ఫౌండేషన్ మద్దతుతో గిరిజన మహిళలు లక్షాధికారులుగా మారడం, ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు విక్షిత్ భారత్కు మార్గం సుగమం చేస్తాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సద్గురు దార్శనికతను నెరవేరుస్తాయని కేంద్ర గిరిజన …
Read More »హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూంధాంగా నిర్వహించారు.11 ఏళ్లుగా సింహవాహిని శ్రీ మహంకాళి …
Read More »