ఆరేళ్లుగా స్థానిక సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజూ దర్శనమిచ్చే ఈ నెమలి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం ఎనిమిదికి ఆలయానికి చేరి సాయంత్రం నాలుగున అడవికి వెళ్ళే ఈ నెమలిని.. భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఆ నెమలితో ప్రత్యేకంగా సెల్పీలు దిగుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కనిపించే ఓ నెమలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఆలయానికి చేరుకొని.. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవికి వెళ్లిపోతుంది. గత …
Read More »పాలకొల్లులో ఆవుల కోసం గరుకు స్తంభాల ఏర్పాటు.. ఈ గరుకు స్తంభం విశిష్టత ఏమిటంటే..
మనిషికి దురద పుడితే ఏం చేస్తారు చేతితో గోకుతారు. వీపు భాగం లో ఐతే పుల్ల తోనో మరేదైనా వస్తువునో ఉపయోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా వెదురుతో చేసిన వస్తువులు సైతం మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. మరి ఇదే కష్టం ఒక నోరులేని జీవికి వస్తే అది యెంత వేదనకు గురి అవుతుంది. సాధ్యమైనంత వరకు తనకు తాను శరీరానికి కలిగిన అసౌకర్యాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆవుకి ఉండే గంగ డోలుకి దురద కలిగితే.. తీర్చుకునేందుకు గరుకు స్థంభాలను ఏర్పాటు …
Read More »తిరుమల కొండలో ట్యాక్సీల దందాకు చెక్.. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ పక్కా ప్లాన్
ఆపదమొక్కుల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమల కొండకు చేరతారు. మొక్కులు చెల్లించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతారు. ముడుపులు కట్టి కొండ మెట్లు ఎక్కి కోనేటి రాయుడు దర్శనం కోసం తిరుమల కొండకు చేరి భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. అయితే భక్తులను ప్రవేయిట్ వాహనదారులు అధిక చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ చేసింది.ఏడుకొండల మీద కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొందరు మెట్ట …
Read More »పెళ్ళికొడుకు అలంకారం లో ముస్తాబైన పరమశివుడు… మహాశివరాత్రికి మూడు రోజుల ముందే కళ్యాణ మహోత్సవం…
23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..దక్షిణ కాశీగా పేరుగాంచిన వరంగల్ లోని శ్రీ స్వయంభు …
Read More »దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, …
Read More »వేడుకగా సమతాకుంభ్ 2025.. గద్యత్రయ పారాయణంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు (14-02-2025) శుక్రవారం ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్స్వామి మార్గనిర్దేశంలో అర్చక స్వాములు, రుత్విక్లు, వేద విద్యార్థులు, భక్తులు కలిసి ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు.రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు (14-02-2025) శుక్రవారం ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్స్వామి మార్గనిర్దేశంలో అర్చక స్వాములు, రుత్విక్లు, వేద విద్యార్థులు, భక్తులు కలిసి ధ్యాన పద్ధతిని …
Read More »మాఘ పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కురిసిన పూల వర్షం.. పరవశించిపోయిన భక్తులు..
ఇవాళ్ఠి మాఘ పూర్ణిమ పెద్ద పుణ్యదినాలలో ఒకటి కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి మహా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో విస్తృత ఏర్పాట్ల మధ్య లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో ఓ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది.మహా కుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇవాళ మాఘ పూర్ణిమను పురస్కరించుకుని పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల తాకిడి ఎక్కువైంది. బుధవారం తెల్లవారుజాము నుంచే …
Read More »మహా కుంభమేళ భక్తులకు అలర్ట్.. అవన్నీ ఫేక్ న్యూస్..! కేంద్రమంత్రి వివరణ..
జనవరి 13న మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుండి గత 26 రోజుల్లో, 42 కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టుగా ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. దేశ, విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రయాగ్రాజ్ రైలు స్టేషన్లలో సరైన ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 2025 మహాకుంభమేళాలో మూడు అమృతస్నానాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రయాగ్రాజ్లోకి భక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. జనవరి 13న మహా కుంభమేళ …
Read More »టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి …
Read More »నాగోరే నాగోబా.. దారులన్నీ కేస్లాపూర్ వైపే.. మహా జాతరకు వేళాయే..
నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరుగుతుంది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో ప్రజ్వలితమవుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కాబోతోంది. జనవరి 28న మొదలై ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర సాగనుంది.తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు …
Read More »