ఇది సార్ మన రేంజ్.. అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం..

అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన ఎలమంచిలి ఏటికొప్పాక లక్కబొమ్మలకూ మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బొమ్మలు.. మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ది.. ఇక్కడ ఈ కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్క బొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ వృత్తిపైనే ఆ గ్రామస్తులు చాలామంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బొమ్మలకు ప్రాణం పోసి పొట్ట నింపుకుంటున్నారు అక్కడి కళాకారులు..

ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లోనూ.. ఏడు కొప్పాక బొమ్మల శకటం సత్తా చాటింది. ఈసారి ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డు కు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్క బొమ్మలకు మరో గౌరవం దక్కింది.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త చేతులు మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇప్పటికే.. గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మలు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు పొందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవార్డుతో లక్కబొమ్మల ఖ్యాతి మరింత పెరుగుతుందని తెలిపారు. మన లక్క బొమ్మలకు మరింత ఖ్యాతి రావాలని ఆకాంక్షించారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *