ఫేమస్‌ రెస్టారెంట్‌లో మంటలు.. భవనం పై నుంచి దూకిన ప్రజలు..

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుండి దూకడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

హుటాహుటిన మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. రాజౌరీ గార్డెన్‌ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న జంగిల్‌ జంబోరీ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం ఒక రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *