నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!

ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఈ సమావేశంలో తీర్మానించనున్నట్టుగా తెలిసింది. సాయంత్రం 4 గంటలకు …

Read More »

తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారందరికీ ఈ …

Read More »

కోడి పందేలకు కోర్టు చిక్కులు…హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది…

సంక్రాంతి అంటేనే ఎంతో సందడిగా ఉండే పండుగ. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటిముందు రంగు రంగుల రంగవల్లులు ఇలా ఒక్కటేమి సంక్రాంతి వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాల గ్రామాలు సందడిగా మారిపోతాయి. మరోపక్క పెద్ద ఎత్తున సాంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఎన్ని చర్యలు చేపట్టిన పండుగ మూడు రోజులు మాత్రం పందాలు జరిగి తీరుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు.సంక్రాంతి పండుగ వేళ.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు …

Read More »

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి.సంక్రాంతి సీజన్‌ అంటే.. అందరికీ పండగే. సామాన్యులకు భక్తి.. వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్‌ సీజన్‌ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్‌ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. …

Read More »

ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ. లక్ష వరకు జీతం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నెలకు రూ.లక్ష వరకు జీతం అందివచ్చే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 23. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)..  ఆధ్వర్యంలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ …

Read More »

తిరుపతి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురు అధికారులపై వేటు..!

తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుపతి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం నుంచి ఆరాతీసిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. డీఎస్పీ …

Read More »

ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాః కేటీఆర్

కేటీఆర్‌‌పై ఫార్ములా ఈ రేస్‌ కేసు ఆరోపణల నేపథ్యంలో ఓ వైపు లీగల్‌ ఫైట్‌.. మరోవైపు పొలిటికల్‌ పోరాటం. ఈ రెండూ సమాంతరంగా సాగాలని భావిస్తోంది బీఆర్ఎస్. కేసులపై న్యాయపరంగా పోరాడాలని భావిస్తున్న కేటీఆర్.. అదే సమయంలో బీఆర్ఎస్‌ రాజకీయ పోరాటాలు కూడా అదే స్థాయిలో కొనసాగాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు.ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా పోరాటం ఆగదన్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి …

Read More »

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు పూర్తి నివేదిక.. అందులో ఏముందంటే?

Tirupati Stampede: తిరుపతిలో మృత్యు ఘోష యావత్‌ రాష్ట్రాన్ని కలిచివేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెట్ల జారీ కేంద్రం… ఆరుగురిని బలితీసుకుంది. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాటలో 41 మంది గాయపడ్డారు. అయితే స్పాట్‌లో ఏం జరిగింది..? అధికారులు తీసుకున్న చర్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకు రిపోర్ట్‌ వెళ్లింది.వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జనవరి 8 బుధవారం ఉదయం బైరాగిపట్టెడ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకూ పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి భక్తుల్ని …

Read More »

సంక్రాంతి రద్దీ.. కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..ఇక్కడ పూర్తి వివరాలు

డీపో మేనేజర్ సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు.. నేటి నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్ నుండి అమలాపురం వచ్చేందుకు 97 సర్వీసులు అదనంగా ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ తెలిపారు. సాధారణ రోజుల్లో 12 బస్సు సర్వీసులు నడపగా సంక్రాంతి సందర్భంగా 85 ప్రత్యెక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మరలా తీరుగు ప్రయాణం కోసం 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమలాపురం నుండి హైదరాబాద్ కు 220 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా..అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం …

Read More »

లేటుగా వచ్చారని స్టూడెంట్స్‌ను వీరబాదుడు బాదిన టీచర్.. కట్ చేస్తే..

టెన్త్, ఇంటర్మియట్ చదువుతున్న విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థులకు వాతలు తేలాయి. విషయం తెలియడంతో తల్లిదండ్రులు.. స్కూల్‌కి చేరుకుని ఆందోళన దిగారు. అతడ్ని సస్పెండ్ చేయాంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చదువు చెప్పాలి.. తప్పు చేస్తే.. కాస్త గట్టిగా భయం చెప్పాలి. అంతేకానీ ఇలా పశువులను బాదినట్లు బాదితారా..? సిద్దిపేట – కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో చదువతున్న 30 మంది ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులు.. ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్‌కు వివిధ కారణాల …

Read More »

సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట..

టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం టీవీ 9 జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి …

Read More »

పండుగ వేళ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోనే ఉంటుందా..?

సంక్రాంతి నేప‌థ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ద‌మైంది. ఈ పండుగ‌కు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజ‌మాన్యం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఆయా రోజుల్లో ర‌ద్దీ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 19, 20 తేదిల్లో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీకి సంబంధించి త‌గిన ఏర్పాట్లు …

Read More »

ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబద్‌.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు

హైదరాబాద్ ఐటీ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణలో ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నట్లే, ఇప్పుడు ఫార్మా రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ వ్యాపార విస్తరణకు, సమర్థవంతమైన నిర్వహణకు ఈ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఇటీవల, హైదరాబాద్ ఫార్మా జీసీసీలకు కీలక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు ప్రారంభం 700 బిలియన్ డాలర్ల విలువైన లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో ప్రముఖ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం ఎంచుకుంది. మెర్క్ (ఎంఎస్), …

Read More »

పండగకు ఊరెళ్లేవారికి పోలీసులు సూచనలు.. ఫాలో అవ్వకపోతే మీకే నష్టం

తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందరూ ఒక్కచోట ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన చాలా మంది వ్యక్తులు సొంతూర్లకు వచ్చి.. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య చేసుకునే పండగ ఇది. అయితే పండక్కి ఊరెళ్లెవారికి ఓ అలెర్ట్…తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త ఏడాదిలో మొట్టమొదట వచ్చే పండుగ. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరి ఆనందంగా ఉండే సమయం. అందుకే …

Read More »

వై దిస్ వైరస్ వర్రీ.. అమ్మబాబోయ్.! పెట్రేగిపోతున్న మాయదారి రోగాలు

కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరూ. జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి. అందుకే కొత్తగా ఏ వైరస్‌ పేరు విన్నా.. ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఈ సీజన్‌లో ఎవరి నోట విన్నా హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ మాటే. మరోవైపు మనం ఎప్పుడో చూసిన నోరో వైరస్‌ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది. పశుపక్ష్యాదులకే పరిమితమనుకున్న బర్డ్‌ ఫ్లూ అమెరికాలో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏమిటీ మాయరోగాలు? మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతోందా? మాయదారి క్రిముల కోరలు పదునెక్కుతున్నాయా?వైరస్‌ పుట్టినిల్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది. …

Read More »