ప్రతి సామాన్యుడికి సొంతిళ్లు అనేది ఓ కల. తాము ఉద్యోగం చేసే ఊర్లో ఓ సొంతిళ్లు ఉండాలని ప్రతిఒక్కరు కలలు కంటుంటారు. చాలా మంది అప్పులు చేసైనా, లోన్లు తీసుకునైనా సరే.. సొంతింటి కలను నెరవేర్చుకుంటుంటారు. గతంలో అయితే స్థలం కొనుక్కుని.. అందులో మనకు కావాల్సినట్టుగా కలల సౌధాన్ని నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు బిల్డర్లే కట్టి రెడీమేడ్గా.. కూరగాయలు అమ్మినట్టుగా అమ్మేస్తున్నారు. ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్టమెంట్లలో ఫ్లాట్లు ఇలా ఏది కావాలన్నా దొరుకుతుంది కానీ.. వాటి ధరలు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. అప్పర్ …
Read More »భవనం కూల్చివేశారు సరే.. మా భవిష్యత్తేంటి? గచ్చిబౌలి ఘటనలో ట్విస్ట్
గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్లో నాలుగంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒకపక్కకు ఒరిగి భయాందోళన సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇదిలా ఉండగా.. భవనం పక్కన గుంతలు తవ్వి పక్కకు ఒరగడానికి కారణమైన బిల్డర్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. …
Read More »ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్మెంట్పై ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి స్వస్తి పలికింది.. ఫీజు రీయింబర్స్మెంట్పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది.. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు (ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల …
Read More »మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా, శిక్షించాల్సిందే.. ఏపీ హైకోర్టు సీరియస్
గుంటూరు మేయర్, వైఎస్సార్సీపీ నేత కావటి మనోహర్నాయుడిపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ వంటి పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని.. అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. ఏ పార్టీ వారైనా సరే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. …
Read More »ఆ రెండు ఖరీదైన BMW కార్లు ఎక్కడ.. ఆరా తీసిన పవన్ కళ్యాణ్, అధికారుల సమాధానం ఏంటో తెలిస్తే!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా.. అవి మాయం అయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా.. ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం.. ఎవరి దగ్గర ఉంది.. …
Read More »Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం
ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్గిర్ జిల్లా బంగముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని జురాబంధ్ గ్రామంలో నవంబరు 16న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళకు చెందిన వ్యవసాయ భూమి మీదుగా నిందితుడు ట్రాక్టర్ నడుపుతూ పంటకు నష్టం కలిగించడంతో ఆమె నిలదీసింది. ఈ క్రమంలో అతడితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆమెపై నిందితులు దాడి చేసి నోటిలో బలవంతంగా మానవ మలాన్ని కుక్కారు. వారి నుంచి …
Read More »HYD-విజయవాడ నేషనల్ హైవే విస్తరణ.. NHAI అధికారులకు మంత్రి కీలక ఆదేశం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రహదారిపై ప్రతి నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ఒకటి. అయితే ఈ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉండగా.. వాహనాల రద్దీ కారణంగా ప్రతినిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రహదారి విస్తరణకు కేంద్రం డిసైడ్ అయింది. ఆరు వరుసలుగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రీన్ …
Read More »YS Jagan: చంద్రబాబు, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎవరిపై అయినా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఆరోపించారు. అందరి కుటుంబాలలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ విబేధాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తల్లీ, …
Read More »ఒక్కడిని చేసి దాడి.. కట్ చేస్తే.. ప్రమాదం జరిగి ఒళ్లంతా గాయాలు.. అంతా కర్మ ఫలితమేనా!
సత్కర్మభీశ్చ సత్ఫలితం.. దుష్కర్మ ఏవ దుష్ఫలం.. అత్యుత్కట పుణ్యపాపానాం సత్యంబలానుభవమిహం.. పురాణాల్లో ఉన్న శ్లోకమిది. మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితమూ, చెడ్డ పనులు చేయడం వల్ల చెడు ఫలితమూ వస్తాయని.. ఏదైనా మనం చేసిన దాని ఫలితాన్ని అనుభవించాల్సిందేనని చెప్పేదే కర్మ సిద్ధాంతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ కథనం, ఫోటోలు, వీడియోలు చూస్తే.. కర్మ సిద్ధాంతం నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయికి మెసేజ్ చేశాడనే …
Read More »వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన
వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి విరాంజనేయస్వామి, మండలిలో ప్రతిపక్ష నేత …
Read More »Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే!
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–175-195 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–85-112 సీట్లుఇతరులు–7-12 కేకే సర్వే మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)-225 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)- 56ఇతరులు-07 రిపబ్లిక్ సర్వే మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–110-130 సీట్లుఇతరులు–8-10 సీట్లు మ్యాట్రిజ్ మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)– 110-130 సీట్లుఇతరులు–8-10 సీట్లు పీ మార్క్ మహాయుతి(బీజేపీ-షిండే …
Read More »హైదరాబాద్లో భారీ స్కామ్.. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి నిండా ముంచేశారు
రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి ఓ సంస్థ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కూకట్పల్లి కేంద్రంగా ఓ సంస్థ వ్యాపారం ప్రారంభించింది. తమ కంపెనీలో 8 లక్షల 8 వేలు పెట్టి రెండు గుంటల స్థలం కొంటే.. ప్రతి నెలా 4 శాతం చొప్పున రూ.32 వేలు తిరిగి చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ …
Read More »ఆడ ‘తోడు’ కోసం ‘టైగర్ జానీ’ అలుపెరగని ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు 340 కి.మీ ప్రేమయాత్ర..!
ప్రేమ, విరహం మనుషులకే కాదు జంతువులకూ ఉంటుంది. అందుకు సరైన ఉదాహరణ టైగర్ జానీ అనే పెద్ద పులి. ఆడ తోడు కోసం ఈ టైగర్ అలుపెరుగని ప్రయాణం సాగిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెల రోజులుగా నడక సాగిస్తూనే ఉంది. ఇప్పటికే 340 కి.మీ దాటిన ప్రేమయాత్ర ఇంకా సాగుతూనే ఉంది. మహారాష్ట్ర అడవుల నుంచి కొండలు, గుట్టలు దాటి తెలంగాణ కవ్వాల్ అభయారణ్యంలోకి చేరుకుంది. నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద ఈనెల 11న ఓ పులి …
Read More »ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్.. మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని.. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీకి రెఫర్ చేసి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల …
Read More »శ్రీ శృంగేరి శారదా పీఠానికి వైఎస్ జగన్.. గంటసేపు అక్కడే, ఎందుకెళ్లారంటే!
విజయవాడలో ఉన్న శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. అక్కడ జగన్ దాదాపు గంటసేపు గడిపారు. స్వామిజీతో చర్చించిన అంశాలను వెల్లడించలేదు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ వెళ్లిపోయారు. జగన్తో వెంట వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal