ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. ఇందుకు సంబంధించి సంచలన వీడియో బయటపడింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియోలో చర్చలు జరిపారు పలువురు రౌడీ షీటర్లు.. కోటంరెడ్డిని చంపేందుకు ఐదుగురు రౌడీషీటర్ల మాస్టర్ ప్లాన్ రచించారు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించిన జగదీష్, …
Read More »విశాఖలో మరో స్పెషల్ అట్రాక్షన్.. టూరిస్టులకు కావాల్సింది ఇదికదా..! సగం రేటుకే చుట్టేయొచ్చు..
విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ పర్యాటక బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకూ బీచ్ రోడ్లో ప్రయాణించనున్నాయి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా …
Read More »ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. లంచం తీసుకున్న సబ్-ఇన్స్పెక్టర్కు ఏడేళ్ల జైలు శిక్ష!
నిందితులను జైలు పంపించాల్సింది పోయి తానే జైలుపాలు అయ్యాడు ఓ పోలీసు అధికారి. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఓ సబ్-ఇన్స్పెక్టర్కు అవినీతి నిరోధక కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది ఏసీబీ కోర్టు. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు సబ్ ఇన్స్పెక్టర్. దీంతో బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా.. సబ్-ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. దీంతో అతన్ని ఏసీబీ …
Read More »గతంలో రుషికొండకు రాకుండా అడ్డుకున్నారు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
విశాఖపట్నంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు.. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ శుక్రవారం రుషికొండలో పర్యటించారు. రుషికొండకు చేరుకున్న ఆయన అక్కడి భవనాలను పరిశీలించారు. పవన్ కల్యాణ్ వెంట పలువురు జనసేన ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు.. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ శుక్రవారం రుషికొండలో పర్యటించారు. …
Read More »విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్ 30న పాఠశాలలు బంద్.. వరుసగా 2 రోజులు సెలవులు
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు కలెక్టర్లు. విద్యా సంస్థలకు ఆగస్ట్ నెలలో చాలా సెలవులు వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలతో పాఠశాలలకు సెలవులు …
Read More »జీఎస్టీలో కీలక మార్పులు.. రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందా..? సెప్టెంబర్ 3న ఏం జరగనుంది..?
ఏ రేట్లు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి.. మోదీ చెప్పినట్లు ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారా..? జీఎస్టీలో కీలక మార్పులు ఉంటాయా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ సాగుతోంది. ఈ చర్చకు మరో నాలుగు రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంపైనే అందరి కళ్లు ఉండడానికి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనే కారణం. జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకొస్తామని.. కొన్ని వస్తువుల …
Read More »ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరమ్కి హాజరైన మోడీ, ఇషిబా.. బహుళ రంగాల్లో భారీగా పెట్టుబడులు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్, చైనాల దేశాల్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు టోక్యోకి చేరుకున్నారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మోడీ జపాన్ లో పర్యటిస్తున్నారు. జపాన్తో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం కావచ్చు. ఆగష్టు 30 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తన జపాన్ కౌంటర్ షిగెరు ఇషిబాతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ పర్యటన సందర్భంగా.. ప్రధాన మంత్రి మోడీ X లో …
Read More »క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన మహిళా MLA.. ఓ చెట్టు కింద ముగ్గురు యువకుల్ని చూసి షాక్..
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా రంగంలోకి దిగి గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పట్టించారు. కాలేజ్ పరిసరాల్లో మహిళలు, చిన్నారులను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు తెలపడంతో ఆమె పోలీసులతో కలిసి గాలించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపగా, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వాళ్లంతా చెట్టు కింద కూర్చున్నారు. ఏదో సరదా కూర్చున్నారా అంటే అదేం కాదు.. ముచ్చట్లు చెప్పుకుంటూ ఏకంగా గంజాయి సేవిస్తున్నారు. మరో ప్రపంచంలో తేలియాడుతున్నారు. …
Read More »జేఎన్టీయూ హైదరాబాద్లో అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే …
Read More »మార్వాడీ గో బ్యాక్ ప్రచారంపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ! ఏమన్నారంటే..?
తెలంగాణలోని ‘మార్వాడీ గో బ్యాక్’ ప్రచారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ప్రచారానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపారులు, కొన్ని సంఘాలు ఈ ప్రచారానికి మద్దతు ఇస్తున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు సంయమనం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ‘మార్వాడీ గో బ్యాక్’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని సంఘాలు ఈ ప్రచారం జోరుగా చేస్తున్నాయి. తెలంగాణలో ఆర్థిక దోపిడీకి మార్వాడీలో కారణం అవుతున్నారని, గుజరాత్కు చెందిన వాళ్లు తెలంగాణలో వ్యాపారాలను శాసిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. …
Read More »మెగా DSCలో మెరిసిన శ్రీకాకుళం గృహిణి.. ఏకంగా 5 టీచర్ కొలువులకు ఎంపిక! మార్కులు చూశారా..
ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృషిణి. భర్త, ఇద్దరు పిల్లలు. పెద్దగా కోరికలేవీ లేకపోయినా.. ఏనాటికైనా టీచర్ కావాలన్నది ఆమె జీవితాశయం. రాధా కుమారికి ఉపాధ్యాయ వృత్తి అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే.. బీఎడ్, డీఎడ్, ల్యాంగ్వేజ్ పండిట్.. ఇలా వరుస పెట్టి డిగ్రీలు చేయించింది. అంతేనా ఐదేళ్లపాటు ఓ వైపు సంసార రథాన్ని లాగుతూనే.. మరోవైపు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. ఏం కావాలో, …
Read More »మరో బాంబ్ పేల్చిన వాతారణ శాఖ.. వచ్చే 7 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన చేసింది. తెలంగాణలో రెండు రోజులపాటు, ఏపీలో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడినప్పటికీ.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది. రెండు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాల్లో మరో వారం రోజులపాటు భారీ …
Read More »కార్యకర్తలకు అండగా ఉండాలి.. జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
సేనతో సేనాని.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి బాటలు పడాలి అంటున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. సాగరతీరం విశాఖలో మకాం వేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు పవన్ …
Read More »ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టి వెళ్లిన క్రీడా ప్రోత్సాహకాలను రిలీజ్ చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. ఏళ్లకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయడంలో రాష్ట్రంలోని క్రీడా కారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవినాయుడు …
Read More »ప్రధాని మోడీ మెచ్చిన అరకు కాఫీ గింజలతో.. యువకులు గణపతి విగ్రహం తయారీ..పోటెత్తుతున్న భక్తులు
ఈ సంవత్సరం అరకు కాఫీలో అరుదైన అలాంటి అరకు కాఫీ గింజలతో ఇప్పుడు విజయనగరం జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు. తోటపాలెం షిర్డీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ గింజల వినాయకుడు భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన వినాయకుణ్ణి ఏర్పాటుచేయాలని నిర్వాహకులు మట్టితో చేసిన గణపతికి ఒక్కొక్క కాఫీ గింజను అద్దుతూ కళాత్మక రూపాన్ని తీసుకొచ్చారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ అందరి చూపును …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal