దశ తిప్పిన ఐపీఓ.. లిస్టింగ్‌తో చేతికి రూ. 2.75 లక్షలు.. ఒక్కరోజే 100 శాతం పెరిగిన షేరు!

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఇందులో లాభాలపై ఆశతో కొత్తగా ఎక్కువ మంది చేరుతున్నారని చెప్పొచ్చు. అయితే వీరు ముందుగా మార్కెట్లపై మంచి అవగాహన పెంపొందించుకోవాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహాతో సరైన స్టాక్ ఎంచుకోవాలి. కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు ఇలా అన్నీ గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. ఇక ఐపీఓలు మాత్రం లిస్టింగ్‌తోనే మీ సంపదను …

Read More »

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్

తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. గత 10 రోజులకు పైగా.. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. …

Read More »

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు.. సొంత డబ్బులతో అంబులెన్స్, 

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలను చూడలేకపోయారు.. వెంటనే సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల రంపచోడవరం మండలం దారగూడెంకు చెందిన నెరం పద్మకాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రూ.5500లతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహం గ్రామానికి చేర్చారు. రంపచడోవరం నియోజకవర్గంలో ఇక నుంచి ఎవరూ …

Read More »

పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవలి కాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెద్ద మొత్తంలో పతనమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుంటున్నాయి. కిందటి రోజు తగ్గిన రేట్లు ఇవాళ మళ్లీ ఎగబాకాయి. అయితే భారీ మొత్తంలో ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఈసారి కూడా స్థిరంగా ఉంచినప్పటికీ.. సెప్టెంబర్ మీటింగ్ సమయంలో కచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంతో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. …

Read More »

 గంటలోనే 13 సెం.మీ. వర్షం.. రెడ్ అలర్ట్ జారీ.. 

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురిసిన వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక, దేశ రాజధాని నగరం ఢిల్లీని బుధవారం సాయంత్రం వరుణుడు వణికించాడు. కేవలం గంటలోనే దాదాపు 13 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గురువారం కూడా అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్న భారత వాతావరణ విభాగం.. రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఇక, బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ …

Read More »

ఏపీలో ఈ పింఛన్లు తీసుకునేవారికి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యమలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, థలసేమియా, లెప్రసీ, సీవియర్‌ హీమోఫిలియా వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇలా …

Read More »

ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 1, 2024): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో …

Read More »

పార్లమెంటును కుదిపేసిన ప్రధాని మోదీ ట్వీట్.. ఇంతకీ ఏం పోస్ట్ చేశారంటే?

Modi Tweet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన ఓ ట్వీట్.. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ అంశం పార్లమెంటులో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణం అయింది. లోక్‌సభలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పటికే తీవ్ర దుమారానికి కారణం కాగా.. తాజాగా అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. ప్రతీ …

Read More »

Nadendla Manohar: ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం

 నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. వంటింట్లో రోజూ ఉపయోగించే కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయాన్ని.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి నిత్యావసరాల ధరలను తగ్గించిందని గుర్తు చేసిన మంత్రి నాదెండ్ల.. తాజాగా మరోసారి తగ్గింపు …

Read More »

నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లో 102 ఉద్యోగాలు.. 

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాబార్డు (National Bank For Agriculture And Rural Development) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 102 అసిస్టెంట్ మేనేజర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, …

Read More »

దేశంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ రైలు.. 

కాలంతో పాటు రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఉన్న సాంకేతికతో అధునాతన సౌకర్యాలతో కోచ్‌లు, సెమీ-హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. కొత్త రైలు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల తరహాలో స్టేషన్ల తీర్చిదిద్దుతోన్న కేంద్ర ప్రభుత్వం.. వందేభారత్, వందే సాధారణ్ లాంటి రైళ్లను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తోన్న ఈ రైళ్లు తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు.. ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేస్తున్నాయి. కాగా, వందేభారత్ కంటే ముందే ప్రారంభమైన ఓ సూపర్ ఫాస్ట్ రైలు కేవలం మూడు స్టేషన్లలో …

Read More »

పీవీ సింధు స్టన్నింగ్‌ షో.. మూడో ఒలింపిక్‌ మెడల్‌ దిశగా విజయం

తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్‌ అబ్దుల్‌ రజాక్‌పై 21-9, 21-6తో వరుస సెట్లలో గెలిచి.. శుభారంభం చేసింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్‌ కుబాను సైతం ఓడించింది. తొలి మ్యాచ్‌కు మించి బుధవారం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తాచాటింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 21-5తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో …

Read More »

టాప్-6 మ్యూచువల్ ఫండ్స్.. పదేళ్లలో అదిరిపోయే లాభాలు.. 

భారత్‌లో గత కొంత కాలంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఏటా పెరుగుకుంటూ వెళ్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌వైపు జనం ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ఇంకా ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) జనాన్ని ఆకర్షిస్తున్నాయి. దీని ద్వారా ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం డబ్బుల్ని కొంత కాలం వరకు ఇన్వెస్ట్ చేస్తుండాలి. అప్పుడు ప్రతి ఏటా మంచి రాబడితో లాంగ్ టర్మ్‌లో భారీగా లాభాలు అందుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం కూడా సిప్ అనేది …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »

జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ రిక్వెస్ట్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …

Read More »