పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పబ్లిక్ డొమైన్లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై రెండో రోజు వాదనలు కొనసాగాయి. నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు… నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా.. అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని నిన్న హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం …
Read More »డిప్యూటీ సిఎం ఇలాకాలో శ్రావణ శోభ.. పిఠాపురం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కనుక..
శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయి. అంతేకాదు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తన నియోజకవర్గ ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకను అందజేస్తున్నారు. పాదగయ పుణ్యక్షేత్రం శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. చివరి శ్రావణ …
Read More »సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ (ఎక్స్)లో చిరంజీవి ఒక పోస్ట్ షేర్ చేశారు. మెగాస్టార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగులు జరగడం లేదు. తమ వేతనాలు 30% వరకు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళనక దిగడమే ఇందుకు ప్రధాన కారణం. …
Read More »శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్.. ఒక్కరోజు ఆదాయం ఎన్ని కోట్లంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచ వ్యాప్త భక్తులకు కొంగు బంగారమైనాడు శ్రీనివాసుడు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే కూడా భక్తులకు పరమ పవిత్రం. ఈ లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కాగా, స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. ఇటీవల టీటీడీ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు …
Read More »కార్గో నుంచి తీసుకెళ్లని ఫోన్లు, చీరలు, టీవీలు, ఎల్ఈడీ లైట్స్.. 90 శాతం డిస్కౌంట్తో వేలం
తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు గుడ్న్యూస్ తెలిపింది. ఆర్టీసీ కార్గోలో కొన్ని పార్శిళ్లు గమ్యం చేరలేకపోతున్నాయి. అయితే కార్గో నుంచి బట్టలు, టీవీలు, ఎల్ఈడీ లైట్స్, ఇతర కిచెన్ వస్తువులను తీసుకెళ్లని వాటిని వేలం వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఏకంగా 90 శాతం డిస్కౌంట్తో అందిస్తున్నారు. ఆసక్తిగల వారు జేబీఎస్ బస్టాండ్లోని 14వ బస్టాప్ కార్గో సెంటర్ వద్ద వీటిని వేలం వేస్తున్నారు. గత రోజులుగా కొనసాగుతున్న ఈ వేలం ఈ రోజుతో ముగియనుంది. అంటే 22వ తేదీతో ముగియనుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే …
Read More »మల్లన్న హుండీకి భారీ ఆదాయం.. 27 రోజుల్లోనే 4 కోట్లకు పైగా నగదు.. బంగారం, వెండి కానుకలు
శక్తిపీఠము జ్యోతిర్లింగము ఒకే చోట కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి పట్ల ఎన్నారైలు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. హుండీ లెక్కింపులో విదేశాల కరెన్సీ పెద్ద ఎత్తున ఉండటం ఇందుకు నిదర్శనం. అమెరికా, సింగపూర్ కెనడా, న్యూజిలాండ్, ఖతార్, యూరప్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్, ఒమన్.. తదితర అనేక దేశాల నుంచి ఆయా కరెన్సీ మల్లన్న హుండీలో వస్తుండటం పట్ల ఆలయ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ …
Read More »సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే
కాశీ యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఈ సౌలభ్యం. అదేంటో మరి చూసేయండి. ఆ ట్రైన్ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి. మీకే తెలుస్తుంది. వచ్చేనెల సెప్టెంబర్ 2న భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైద్యనాథ్ ధామ్(SCZBG46) 9 రాత్రులు / 10 రోజులుతో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం బయలుదేరనుంది. ఇది కవర్ చేయబడిన గమ్యస్థానాలు, స్థలాలు ఇలా …
Read More »ఏపీలో వారందరికి సర్కార్ శుభవార్త.. ఉచితంగా సెల్ఫోన్లు.. దరఖాస్తు ఎలాగంటే..?
ఏపీ సర్కార్ శ్రవణ, మౌన దివ్యాంగులకు ఒక కీలక సహాయం అందించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల వారికి ఉచితంగా టచ్స్క్రీన్ మొబైల్ ఫోన్లు అందజేయనున్నట్టు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఎ.డి.వి. కామరాజు ప్రకటించారు. అర్హతల విషయానికి వస్తే… కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కావాలి. సైన్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం ఉండాలి. కనీసం 40% పైబడిన వైకల్యం ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపుగా ఉండాలి. ఆసక్తి గల వారు తప్పనిసరిగా www.apdascac.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ …
Read More »ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితకు తాళి కట్టిన సీఐ.. కట్ చేస్తే ట్విస్ట్ అదిరింది..!
న్యాయం కోసం ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను మాయమాటలు లోబర్చుకున్నాడు. ఏకంగా తాళి కట్టి, రెండో పెళ్ళి చేసుకున్నాడు నంద్యాల సీసీఎస్ ఇన్స్పెక్టర్. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. తన భార్యను రెండో వివాహం చేసుకుని, తనకు అన్యాయం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2018లో అన్నమయ్య జిల్లాకు చెందిన …
Read More »మరికొన్ని గంటల్లోనే మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల.. విద్యాశాఖ అధికారికంగా వెల్లడి
రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ మెరిస్ట్ లిస్ట్ విడుదలకు శుభ ముహూర్తం ఫిక్సైంది. ఈ మేరకు తాజాగా కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన జారీ చేశారు. తాజా ప్రకటన మేరకు మెరిట్ లిస్ట్ వివరాలతోపాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన విషయాలను.. మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మెగా DSC కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఫలితాల అనంతరం టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం …
Read More »ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్పై బొత్స క్లారిటీ.. ఏమన్నారంటే?
ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఒక బీజేపీ భావిస్తుంటే.. ఇండియా కూటమి అనూహ్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో బీజేపీ మిగతా పార్టీలతో కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని బలపర్చాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. …
Read More »ఏపీలో పెన్షన్ పాలిటిక్స్.. దివ్యాంగుల పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ టాక్ పీక్స్కి చేరింది..! అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ లబోదిబోమంటుంటే.. కేవలం అనర్హులను మాత్రమే ఏరిపారేస్తామని అధికార పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి..! దివ్యాంగుల పెన్షన్ పక్కదారి …
Read More »దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..
ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ కాలంలో నిర్మించబడ్డాయి. వందల సంవత్సరాల తర్వాత కూడా వాటి అందం అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ స్టేషన్లలో లక్నోలోని చార్బాగ్, కాన్పూర్ సెంట్రల్, గోరఖ్పూర్, ప్రయాగ్రాజ్ సెంట్రల్, ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్గా గుర్తింపు పొందింది. 68,525 కి.మీ. పొడవైన రైలు నెట్వర్క్ దేశంలోని ప్రతి మూలలో విస్తరించి ఉంది. …
Read More »ట్రంప్కు చెక్..! చైనాకు ప్రధాని మోదీ.. ఆ ఘటన తర్వాత తొలిసారి టూర్..
ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఎస్సీవో సదస్సుకు రావాలని చైనా మోదీని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారీఫ్లు పెంచిన నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో జరిగిన ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ …
Read More »మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలా? అద్భుతమైన ట్రిక్!
సాధారణంగా కొన్ని సిలిండర్లో అప్పుడప్పుడు సిన్నగా గ్యాస్ లీక్ అవుతుంటుంది. గ్యాస్ రెగ్యులేటర్, పైపు, బర్నర్ను చెక్ చేసుకోవాలి. మీ స్టవ్లో గ్యాస్ లైన్ దెబ్బతిని వుంటే వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అవుతుంది. బర్నర్: చాలా మంది వంట చేసేటప్పుడు బర్నర్ను మొత్తం పైకి తిప్పే అలవాటు ఉంటుంది. దీని వల్ల మీ ఎల్పీజీ గ్యాస్ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏదైనా వేడి చేయాలనుకున్నా, వంట చేయాలనుకున్నా పాత్ర కింది భాగంలో మంట ఉండేలా బర్నర్ ను తిప్పుకుంటే …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal