వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో విద్యార్థులు పెద్ద సాహసానికే ఒడిగట్టారు. తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ ఆటలకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడ దూకి.. పొలాల గట్లపై పరుగెత్తారు. చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో పదవ తరగతి విద్యార్థులు ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించుకునేందుకు సుమారు 80 …
Read More »Blog Layout
సంతాన సాఫల్యానికి సహజ దీప్తి.. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమ దీప్తి!
నేటి రోజుల్లో వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా వ్యాపారంగా చూసే ధోరణి పెరిగిపోతుంది. అలాంటి సమయంలో నిజమైన సేవా భావంతో, నమ్మకంతో రోగులను ఆదుకుంటున్న వైద్యులను కనుగొనడం చాలా అరుదు. అలాంటి అరుదైన వైద్యులలో ఒకరు డాక్టర్ హిమ దీప్తి, సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఆమె ఒక వెలుగుదారి. డాక్టర్ హిమ దీప్తి తన ఎంబీబీఎస్ను ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో పూర్తిచేశారు. తరువాత కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎంఎస్ (ప్రసూతి …
Read More »రేయ్ ఏంట్రా ఇది.. బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్లో కనిపించింది చూసి..
హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. బిర్యానీ తినడానికి హోటల్కు వెళ్లిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. బీర్యానీ అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. అయితే.. బిర్యానీతో సొమ్ముచేసుకుంటున్న కొన్ని హోటళ్లు శుచి శుభ్రతను గాలికొదిలేశాయి.. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ తినాలంటేనే …
Read More »అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? వైసీపీ చీఫ్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఎరువురులు సరఫరా చేసి ఉండే రైతులు రోడ్డెక్కేవారా? అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడంలేదని మండిపడ్డారు. కుప్పం లోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదని.. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయన్నారు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అని జగన్ ప్రశ్నించారు లా అండ్ ఆర్డర్ కాపాడటం లేదు. ప్రజల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు.. ప్రజలకు …
Read More »టీజీ సీపీగెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్సైట్లో అందుబాటులో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. …
Read More »వారు పార్టీ మారారు.. సాక్ష్యం చూపిస్తున్న కేటీఆర్.. నెక్స్ట్ ఏం జరగనుంది..?
అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు. హమ్మయ్య అధికార పార్టీలోకి వచ్చేశాం.. ఇక సేఫ్ అనుకున్నారు. కానీ, ఫిరాయింపులమీద సుప్రీం ఆదేశాలు.. ఆ వెంటనే స్పీకర్ నోటీసులతో.. ఇప్పుడు సీన్ మొత్తం రివర్సయిపోయింది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై “తాడోపేడో” అంటుండగా, మరికొందరు సైలెంట్గా ఏం జరుగుతుందో చూసే యోచనలో …
Read More »ఏపీలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. కసరత్తు మొదలు పెట్టిన ఎన్నికల సంఘం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మెుదలైంది. ఇప్పటికే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 9) ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సెక్రెటరీలతో నీలం సాహ్ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు, కొత్త ఈవీఎంల కొనుగోలుపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. అయితే ఈవీఎంల ద్వారా …
Read More »వీడుతున్న తురకపాలెం మిస్టరీ మరణాల వెనుకున్న ఆసలు గుట్టు..!!
కేవలం 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. జూలైలో 10 మరణాలు, ఆగస్టులో 10 మరణాలు, సెప్టెంబర్ ప్రారంభంలో మూడు మరణాలు సంభవించాయి. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే ప్రాణాలు.. వరుస మరణాలతో మరణ మృదంగం మోగించిన గుంటూరు తురకపాలెంలో బుధవారం (సెప్టెంబర్ 10) ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. మరణాల మిస్టరీ చేధించేందుకు ఇప్పటికే గ్రామంలో పర్యటించిన పలు జాతీయ సంస్థలు …
Read More »ఇదేం కర్మరా సామి.. ఇలసలు కూడా వేలంలో దక్కించుకోవాల్సి వస్తుంది..!
పుస్తెలు అమ్మి కొని తిందామన్న పులస దొరకడం లేదు. కొందరైతే పులస దొరికితే తమకే ఇవ్వాలని.. రేటు ఎంతైనా పర్లేదని జాలర్లకు అడ్వాన్సులు ఇస్తున్నారు. సీజన్ ఎండింగ్కి వచ్చేసింది. ఇప్పటివరకు దొరికిన పులసలు అంతంత మాత్రమే. దీంతో ఇలసలకు డిమాండ్ పెరిగింది. పులస దొరకడమే బంగారమైపోయింది. చాలు అరుదుగా మాత్రమే గోదావరి జలాల్లో దొరకుతున్నాయి ఈ అత్యంత రుచి కలిగిన ఖరీదైన చేపలు. దొరికే అరాకొర చేపలను దక్కించుకునేందుకు మాంసం ప్రియులు తెగ పోటీ పడుతున్నారు. ఫలితంగా కేజీ, కేజీన్నర చేపలు సైతం దాదాపు …
Read More »నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..
నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దీపక్. హాస్టల్లో ఒకే గదిలో ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్తో కలిసి ఉంటున్నాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైందని, రూమ్లో నుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్ హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. ఆ విద్యార్థిని కాల్చిచంపిన రూమ్మెట్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీపక్ హత్య తర్వాత తానూ కాల్చుకుని దేవాన్ష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal