టీవీ9 క్రాస్ ఫైర్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరంపై ఈటల కామెంట్స్ కాకరేపుతున్నాయి. టీవీ9 క్రాస్ ఫైర్లో చెప్పిన కొన్ని అంశాలు బీఆర్ఎస్కు …
Read More »Blog Layout
జూనియర్ NTR క్రేజ్ చూసి అసదుద్దీన్ ఒవైసీ షాక్..! MIM మీటింగ్లో పేరు చెప్పగానే దద్దరిల్లిన..
ఒక AIMIM సభలో అసదుద్దీన్ ఒవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంతో సభ దద్దరిల్లిపోయింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ పాపులారిటీకి ఒవైసీ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తన టాలెంట్తో బిగ్ స్టార్గా ఎదిగిన నటుడు. యూత్లో జూనియర్ ఎన్టీఆర్కు ఉండే క్రేజ్ గురించి కొత్త చెప్పేందేముంది కానీ, ఓ మీటింగ్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్..! తిరుమలలో దర్శనం, వసతి, శ్రీవారి సేవ సెప్టెంబర్ కోటా విడుదల..!
తిరుమల భక్తులకు టీటీడీ గొప్ప ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే టీటీడీ సెప్టెంబర్ నెల దర్శనం.. గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల …
Read More »గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!
తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఘనంగా ప్రారంభించి …
Read More »డియర్ మినిస్టర్స్.! మాట కొంచెం పొదుపు.. మంత్రులపై టీపీసీసీ సీరియస్..
డియర్ మినిస్టర్స్.. నోట్ దిస్ పాయింట్స్.. మీరు మంత్రులైనంత మాత్రాన అన్నీ మాట్లాడేస్తాం.. పక్క వాళ్ల శాఖలో కలగజేసుకుంటామంటే కుదరదు అంటోంది పీసీసీ. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రులు కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పీసీసీ చీఫ్. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ఎలా ప్రకటన చేస్తారని ఫైర్ అయ్యారాయన.కేబినెట్లో చర్చ జరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడంపై పీసీసీ సీరియస్ అయింది. కోర్టులో ఉన్న అంశాలపై ఎలా పడితే అలా మాట్లాడతారా? ఒకరి శాఖలో మరొకరు …
Read More »కీలక మలుపు తిరిగిన కాలేశ్వరం విచారణ..! మంత్రులతో సీఎం రేవంత్ మీటింగ్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన మలుపు తిరిగింది. కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల నిమిత్తాలను అందించాలని కోరింది. నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చర్చించి అధికారులకు అన్ని వివరాలు కమిషన్ కు అందించాలని ఆదేశించారు.కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలను …
Read More »పాలకొల్లులో ఆవుల కోసం గరుకు స్తంభాల ఏర్పాటు.. ఈ గరుకు స్తంభం విశిష్టత ఏమిటంటే..
మనిషికి దురద పుడితే ఏం చేస్తారు చేతితో గోకుతారు. వీపు భాగం లో ఐతే పుల్ల తోనో మరేదైనా వస్తువునో ఉపయోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా వెదురుతో చేసిన వస్తువులు సైతం మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. మరి ఇదే కష్టం ఒక నోరులేని జీవికి వస్తే అది యెంత వేదనకు గురి అవుతుంది. సాధ్యమైనంత వరకు తనకు తాను శరీరానికి కలిగిన అసౌకర్యాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆవుకి ఉండే గంగ డోలుకి దురద కలిగితే.. తీర్చుకునేందుకు గరుకు స్థంభాలను ఏర్పాటు …
Read More »అడ్డొస్తే తొక్కేస్తారా.. ఎవర్ని తొక్కుతారు? ఇక్కడుంది CBN..! సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, అడ్డుకుంటే తొక్కేస్తామని ప్లకార్డులు ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ను “నాటకాల రాయుడు” అని పిలుస్తూ, ఆయన రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పొదిలి టూర్ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో …
Read More »యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఆర్కె బీచ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు జరుగుతున్న యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహణతో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 3లక్షల 40వేల మందితో ఒకే ప్రాంతంలో యోగా నిర్వహించిన 22 ఐటమ్స్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నామని.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిగమించబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి. …
Read More »ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్లో తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు
ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కాశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని అక్కడి స్థానికులు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు.జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తరువాత అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ మూతపడ్డాయి. భద్రతా చర్యల కారణంగా మూసివేసిన పర్యాటక ప్రాంతాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ తెరిచింది. దాదాపు రెండు నెలల …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal