Blog Layout

అయ్యో దేవుడా.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి..

సైలెంట్ కిల్లర్.. గుండె పోటు కేసులు నానాటికి పెరుగుతున్నాయి.. ఒకప్పుడు గుండె సమస్యలు కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చేవి అనుకునేవారు.. కానీ, ఇప్పుడు కాలం మారింది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటు అందరి ప్రాణాలు తీస్తోంది.. చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. అప్పటివరకు సంతోషంగా తమతో గడిపిన వారు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో.. డీజే మ్యూజిక్ కు డ్యాన్స్ …

Read More »

దేశ ప్రజలకు ప్రధాని మోదీ బర్త్‌డే గిఫ్ట్.. ఈ నెల 17న సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం!

సెప్టెంబర్ 17న తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా తన ఎక్స్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహుమతిని అందించనున్నారు. దేశంలోని మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ …

Read More »

భారత్‌ – ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం..! సంతకాలు చేసిన ఇరు దేశాల ఆర్థిక మంత్రులు

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) పై సంతకం చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించి, వాణిజ్యాన్ని పెంచుతుంది. ఇది 1996 ఒప్పందానికి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, భారత ఆర్థిక మంత్రి సంతకం చేసిన కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను సులభతరం చేస్తుంది. భారత్‌ కొత్త పెట్టుబడి ఒప్పందాల నమూనాకు అనుగుణంగా, ఈ …

Read More »

హైదరాబాద్‌లో మాత్రమే దొరికే 5 రకాల వెరైటీ బిర్యానీలివి.. ఎక్కడంటే?

హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేంతగా ఈ వంటకం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, ఎప్పటిలాగే దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? మీరొక బిర్యానీ ప్రియులైతే, అన్ని రకాల బిర్యానీలు రుచి చూశానని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫుడ్ మ్యాప్‌లో కొన్ని కొత్త, వినూత్నమైన బిర్యానీలు చేరాయి. సరికొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఐదు రకాల బిర్యానీలు ఒక మంచి ఎంపిక. బిర్యానీ.. ఇది కేవలం ఒక వంటకం కాదు, హైదరాబాదీల ప్రేమ, సంస్కృతి. తరతరాలుగా వస్తున్న …

Read More »

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. స్థానికులకు అడ్డంగా దొరికిన యువకుడు.. కట్‌చేస్తే..

కడప జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన కామాందుడు.. ఆ పాపపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని చితబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. రోడ్లపై ఆడ పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అక్కడ ఉన్నది పసిపిల్లా, పండు ముసలా అని కూడా చూడట్లేదు. కామంతో కల్లుమూసుకుపోయి వాళ్లపై పడి తమ …

Read More »

ఏం జరగనుంది..? సడెన్‌గా ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ఒక్కరు.. ఒకే ఒక్కరు తప్పా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్‌ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై …

Read More »

తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది.. అబ్బో.. ఇన్ని రోజులా..?

తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. ఈ ఏడాది దసరా పండగ సెలవుల లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించింది విద్యాశాఖ. ప్రతి ఏడాది మాదిరిగానే.. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా సెలవులు ఇచ్చారు. ఆ డేట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 4నుంచి తిరిగి సాధారణ తరగతులు పునప్రారంభం కానున్నాయి. …

Read More »

పెట్రోల్‌ట్యాంక్‌పై పడిన పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు.. అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది!

విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ఆదివారం మధ్యాహ్నం HPCL పరిధిలో ఉన్న EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్తా ఫ్యాక్టరీ పరిసరాల్లోకి వ్యాపించాయి. దీంతో కంపెనీ వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? లేదా అన్నది …

Read More »

పదో తరగతి అర్హతతో.. ఇంటలీజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు! లక్షల్లో జీతం..

ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్‌ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 455 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ …

Read More »

ఏపీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడంటే?

AP CET’s Counseling Schedule 2025: లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాలు.. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభంకాలేదు. తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను విడుదల చేసింది. …

Read More »