Blog Layout

బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..

రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్‌ పోలీసులు. దానిలో భాగంగా.. విజయవాడ సిటీలో కొద్దిరోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్‌ వాడకుంటే జరిమానా విధించడంతోపాటు.. వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా హెల్మెట్‌ వినియోగంతోపాటు పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపైనా కొరఢా ఝుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్‌ చలాన్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. …

Read More »

కొమురంభీమ్‌ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి

అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ శివారులో రోడ్డుపై వెళుతుండగా పులి ప్రత్యక్షమై రైతులు, వాహనదారులను భయాందోళనకు గురి చేసింది స్థానికుల కేకలు విన్న పులి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి పారిపోయింది.నాన్నా పులి కథ కాదు కానీ.. బెబ్బులి సంచారంతో అక్కడ క్షణక్షణం భయంభయం. కొమురంభీమ్‌ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు దండోరా వేస్తున్నారు. పెంచికల్ పేట్ మండలం దర్గాపల్లిలో‌ పులి సంచరిస్తోంది. ఈ పరిస్థితుల్లో …

Read More »

నిజాయితీ, నిరాడంబర, సరళతకు ప్రతిబింబం.. మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకుంటున్న ప్రముఖులు ఘనంగా నివాళ్లులర్పిస్తున్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణల పట్ల అంకితభావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థికవేత్తగా భారత ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో సేవలందించారని మోదీ గుర్తు చేసుకున్నారు.దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, …

Read More »

ఓరి బాబోయ్.. అల్పపీడనం ముప్పు వీడనే లేదు.. ఈ లోపే

ఏపీకి వానల ముప్పు ఇంకా వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి…బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ …

Read More »

 ఆ మూడు మృతదేహాలపై బలమైన గాయాలు.. ఇంతకీ ఆత్మహత్యలా.. హత్యలా?

మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలేవరకు వెళ్లింది. గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు ఉండటం.. చెరువు గట్టుపై వీరి వస్తువులన్నీ ఉండటం.. అసలింతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే డైలమాలో పడేశాయి..ఒకే సమయంలో.. ఒకేచోట.. అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో ఒక …

Read More »

వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ.. వదిన ఆస్తి కోసమే కుట్ర! ఆ రెండో చెక్క పెట్టె ఎవరి కోసమో?

మహిళ ఇంటికి డెడ్ బాడీ హోం డెలివరీ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో శ్రీధర్ వర్మతోపాటు అతని రెండో భార్య, ప్రియురాలు హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వదిన తులసి ఆస్తి కాజేసేందుకు ఆమెను బెదిరించడానికే పర్లయ్యను హతమార్చినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు..పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్‌లో మృతదేహం కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వదిన తులసిని బెదిరించి, ఆమె ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ …

Read More »

ఏంటీ..! బాబోయ్.. ఆముదంతో ఇన్ని ప్రయోజనాలా ఉన్నాయా..?

ఆముదం అంటే ఈ జనరేషన్ వాళ్లు ముఖాలు అదోలా పెడతారు కానీ… దీన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీ ఇళ్లలో ముసలివాళ్లను అడిగితే దీని బెనిఫిట్స్ ఏంటో చెబుతారని అంటున్నారు. ముఖంపై ముడతలు, చర్మం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలకు ఆముదంతో చెక్ పెట్టవచ్చట..ఆముదాన్ని సంప్రదాయ వైద్య విధానంలో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. చర్మ సంబంధిత సమస్యలు, జుత్తు సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వంటి …

Read More »

 అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన …

Read More »

కొరడాతో దెబ్బలు కొట్టుకున్న అన్నామలై..

తమిళనాడులో మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేశారు. DMKను పదవి నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని ప్రకటించారు. DMK ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. అన్నా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు నిరసనగా ఆయన ఆందోళన చేపట్టారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి….తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు …

Read More »

ఇకపై డిగ్రీ థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజ్‌ సబ్జెక్టులుండవ్‌.. అన్నీ కోర్‌ సబ్జెక్టులే

తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజెస్‌కు స్వస్థి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్‌ ఇయర్‌లో కేవలం కోర్‌ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్‌ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్‌, సెకండియర్‌లోనే ల్యాంగ్వేజ్‌ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. …

Read More »