Blog Layout

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ.. వారానికి ఒక్కసారైనా తింటే..

ఇది కేన్సర్‌ ను నివారిస్తుంది అని వెబ్‌ ఎండీ తెలిపింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్స్‌ ఉంటాయి. ఆర్థ్రరైటీస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అలాగే, అన్ని కూరగాయలతో పాటు క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినమని చెబుతుంటారు. క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య …

Read More »

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్‌ స్కెచ్‌.. ఏడో పెళ్లిలో దొరికి పోయిందిలా!

ఇద్దరు మహిళలు తల్లీకూతుళ్లుగా నాటకాలాడి ఏకంగా ఆరుగురిని బురిడీ కొట్టించి భారీ మొత్తంలో లూటీ చేశారు. వీరికి మరో ఇద్దరు పెళ్లిళ్ల పేరయ్యలు ధనవంతులైన ఒంటరి కుర్రాలను వలేసిపట్టి పెళ్లి చేసేవారు. ఆనక యువతిని కాపురానికి పంపించి.. అవకాశం దొరకగానే ఆ ఇంట్లో బంగారు నగలు, డబ్బు తీసుకుని ఉడాయించడం ఈ రాకెట్ స్కెచ్..ఓ యువతి డబ్బున్న ఒంటరి పురుషులే లక్ష్యంగా.. ప్రేమ, పెళ్లి పేరిట ఘరానా మోసాలకు పాల్పడింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సజావుగా కాపురం చేసి, ఆనక అవకాశం దొరకగానే ఇంట్లో …

Read More »

ఊహాకందని విధ్వంసం.. 20 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో ఆనాటి విపత్తు గాయాలు..!

ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1-తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీగా మారింది. గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన సునామీ థాయిలాండ్, భారతదేశం, శ్రీలంకలను గంటల వ్యవధిలో తాకింది. ఇది బుల్లెట్ రైలు కంటే రెండింతలు ఎక్కువ. శ్రీలంకలో దాదాపు 35,000 మంది మరణించారు. భారతదేశంలో 16,389 మంది, థాయిలాండ్‌లో 8,345 మంది ప్రాణాలు కోల్పోయారు.2004 డిసెంబరు 26.. నిశ్శబ్దంగా ఆరంభమైన ఒక రోజు..! ఆకాశంలో చినుకు జాడ లేకపోయినా, భూమికి ఏదో పెద్ద విపత్తు ముంచుకొస్తోందన్న సంకేతాలు.. తుపాను హెచ్చరికలు లేకుండా, ఎవరికీ ఊహాజనితంగా కూడా …

Read More »

మహా కుంభమేళా కోసం భారీ ఏర్పాట్లు.. తొలిసారిగా అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

మహాకుంభమేళ.. 12 ఏళ్లకు నిర్వహించే వేడుక. సాధువులు, భక్తులు, పర్యాటకులు భారీగా కుంభమేళాకు తరలివస్తారు.ఈసారి 45 కోట్ల మంది రావచ్చనేది.అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టింది యూపీ సర్కార్‌. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఈసారి విరివిగా టెక్నాలజీని వాడుతున్నారు.మహా కుంభమేళాకు వేళాయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌ రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకంగా హైఎండ్‌ టెక్నాలజీని వాడుతున్నారు. అండర్‌ వాటర్‌ డ్రోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సీసీ కెమెరా నిఘా నేత్రాలు ఎటూ …

Read More »

డాలర్‌ డ్రీమ్స్‌తో దొంగ దారుల్లో అమెరికాకు.. ఈడీ నిఘాతో వెలుగులోకి సంచలనాలు..!

డాలర్‌ డ్రీమ్స్‌తో యువతను దొంగ దారుల్లో అమెరికాకు పంపిస్తోన్న దళారీ ఏజెన్సీలపై ఈడీ నిఘా పెట్టింది, ముంబై, నాగ్‌పూర్‌ కేంద్రంగా ఈ దందా చేస్తున్నట్టు గుర్తించింది. మనీ లాండరింగ్‌ కేసులో పిడికిలి బిగిస్తే అక్రమచొరబాట్ల డొంక కదులుతోంది. యూనివర్సిటీలతో సహా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌ల పేరుతో దాదాపు 35,000 మంది విద్యార్థి వీసాలు పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ దృష్టి సారించింది. యువత డాలర్‌ డ్రీమ్స్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఏజెంట్‌ మాఫియా అక్రమ …

Read More »

కలకలం రేపుతున్న కల్తీ కల్లు.. ఆరుగురికి అస్వస్థత.. విచారణలో సంచలనాలు..!

నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంకు చెందిన దుబ్బాక అచ్చయ్య, పాక పిచ్చయ్య, వల్లపు లింగయ్య, మేడిపల్లి భిక్షం, గంట రామచంద్రయ్య, కన్నీబోయిన నరేష్ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే గ్రామానికి చెందిన గీత కార్మికుడి వద్ద గ్రామ శివారులో ఉన్న కుమ్మరి కుంట వద్ద మధ్యాహ్నం కల్లు తాగారు. అయితే అనుహ్యంగా వారంతా అస్వస్థతకు గురయ్యారు. కల్లు …

Read More »

లేడీ హోంగార్డు చేతివాటం.. 3 జిల్లాల్లో రూ. కోటి దాకా లూటీ! ధనవంతులే టార్గెట్

డబ్బున్న వ్యక్తులతో సాన్నిహిత్యంగా మెలుగుతూ, అనంతరం బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పలువురిని ముప్పుతిప్పలు పెట్టి దాదాపు రూ. కోటి వరకు దండుకుంది ఓ మహిళా హోం గార్డు. ఏకంగా పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ వ్యవహరించిన తీరు ఆ శాఖకే కళంకం తెచ్చిపెట్టేలా ఉంది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. వేములవాడలో హోంగార్డుగా పనిచేస్తుండగా రాజన్న ఆలయ అనే మహిళ.. అదే జిల్లాలో ఏఈగా పనిచేసి రిటైర్డ్‌ అయిన శేఖర్‌తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకుంది. …

Read More »

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని IMD అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సముద్రవేటకు వెళ్లొద్దని సూచించారు.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.. నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది …

Read More »

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక! ఎవరు అర్హులంటే..

విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాట్ ఉద్యోగ నియామకాలకు నోఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలను చేపట్టనుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో ప్రతీ నెల స్టైఫెండ్ కూడా అందిస్తారు..రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్​లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం​స్టీల్​ప్లాంట్.. 2024 డిసెంబర్‌ బ్యాచ్‌కు సంబంధించి దాదాపు 250 అప్రెంటీస్​పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్​విడుదల చేసింది. అర్హత, ఆసక్తి …

Read More »

మరోవారంలో యూజీసీ- నెట్‌ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్షలు సమీపిస్తున్నాయి. మరోవారంలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూజీసీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు వంటి వివరాలు ఉంటాయి. ఇక మరో రెండు మూడు రోజుల్లో అడ్మిట్‌ కార్డులు కూడా విడుదల కానున్నాయి. …

Read More »