Blog Layout

ఆర్టీసీ డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన బస్సు.. తీరా కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం..!

బస్సు డిపోలో ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ బస్సు డ్రైవర్, అధికారుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు జాడ గుర్తించారు. అయితే, బస్సు ఇక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ ఎక్కేందుకు తెల్లవారుజామున డిపోకు వచ్చిన ఆ డ్రైవర్‌కు.. అక్కడ ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండాపోయింది. ఇటు అటు చూశాడు. కనిపించలేదు. …

Read More »

పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు: అసలు హంతకుడు అతడే! వదిన ఆస్తి కోసం మరిది దారుణం

పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన చెక్క పెట్టెలో డెడ్ బాడీ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వదిన ఆస్తిపై కన్నేసిన మరిది.. డెడ్ బాడీ సాయంతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరగడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని ఓ కూలి ఇతగాడి పన్నాగానికి బలై శవమయ్యాడు..పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెక్కపెట్టెలో గుర్తు తెలియని మృతదేహం పార్శిల్‌ వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం …

Read More »

ప్రశ్నల వర్షం.. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న పోలీసులు

అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ప్రశ్నలు..అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన పై స్పందించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దాని …

Read More »

విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే

తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్‌ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న …

Read More »

అబ్బురపరుస్తున్న 400 ఏళ్ల నాటి రామదుర్గం చర్చి.. ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పురాతన చర్చిలున్నాయి. అలాంటి చర్చి ఒకటి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఉంది. ఈ చర్చికి నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఆలూరు మండలంలోని రామదుర్గం ప్రార్థన మందిరాన్ని 400 ఏళ్ల క్రితం నిర్మించారు.1780లో ఫాదర్ సెయింట్ రామదుర్గం చర్చిని గోవా రిజిస్టర్లో రాయించారు. ఇది జరిగిన తర్వాత 150 ఏళ్లకు ముందు.. ఆదోనికి చెందిన మినుములు చిన్న నాగప్ప పెద్ద నాగప్ప రామదుర్గంలో పునీత అన్నమ్మ …

Read More »

ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

మెంతికూర సహాయంతో మనం అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు.. మెంతులలో ప్రొటీన్, టోటల్ లిపిడ్, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? ఎప్పుడు తాగాలి.. ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి.. మెంతులను మసాలా …

Read More »

సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ బిగ్ షాక్.. ధరల పెంపు..!

ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం ప్లస్ ధరలను పెంచినట్లు స్పష్టం చేశారు. Elon Musk’s X తన టాప్-టైర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ (ప్రీమియం ప్లస్) ధరలను గ్లోబల్ మార్కెట్‌లతో సహా భారతదేశంలోని పెంచింది. కొత్త ధరలు డిసెంబర్ 21 నుండి అమలులోకి వచ్చాయి. దీని వలన భారతదేశంలోని X వినియోగదారులు నెలకు రూ. 1,750 చెల్లించవలసి ఉంటుంది.ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్‌ సేవలు ఇప్పుడు భారతదేశంలో మరింత ప్రియం అయ్యాయి. ఎక్స్ …

Read More »

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టుల్లో కొన్నింటినీ గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటికి నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది..తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ …

Read More »

సీజన్‌లో భలే గుడ్ న్యూస్.. అరకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదిగో స్పెషల్ ట్రైన్

ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్నారు పర్యాటకులు. సీజన్‌ పీక్‌కు చేరడంతో వంజంగి హిల్స్‌లో సూర్యోదయం సందర్శకులను కట్టిపడేస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటో తెల్సా…మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండిమబ్బులు గాల్లో తేలుతున్న అక్కడి ఆహ్లాదకర వాతావరణం, అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు …

Read More »

రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..?

సాగు చేసే వాడికే సాయం అందాలి. అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పించాలంటోంది కాంగ్రెస్ సర్కార్. సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాళ్లు, రప్పలు ఉన్న భూములకు కూడా …

Read More »