తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లు.. సంగతి సరేసరి. ఇప్పటికే ఎందరో ఆస్పత్రి పాలవగా.. కొందరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులకు పాముకాటుకు గురయ్యారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. ఇటీవల కాలంలో వరుస ఫుడ్ పాయిజన్లు, పాముకాట్లు, విద్యార్ధులు ఆత్మహత్యలతో పలువురు విద్యార్ధులు తనువు చాలించారు. …
Read More »Blog Layout
అల్పపీడనం తీవ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఇక పడతాయా.? బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపధ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం రాష్ట్రంలో పలు జిల్లాలకు వచ్చే 3 రోజులు సూచనలు ఇలా ఇచ్చింది. మరి అవేంటి.? ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి.? ఈ స్టోరీ తెలుసుకుందామా పదండి.!నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం డిసెంబర్ 19వ తేదీ ఉదయం 8.30 గంటలకు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ వరకు విస్తరించి ఉంది. …
Read More »నిరుద్యోగ యువత కోసం ‘ట్రెయిన్ అండ్ హైర్’ ప్రోగ్రామ్.. ఉచితంగా శిక్షణతోపాటు ఉద్యోగం కూడా!
నిరుద్యోగ యువతకు కూటమి సర్కార్ వినూత్న ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది. ఉచితం శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కూడా కల్పించేందుకు ఆయా ప్రాంతాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ప్రారంభంకాగా.. మరికొన్ని చోట్ల అవసరం మేరకు యూనివర్సిటీలు, కాలేజీల నుంచి స్థలాలను సేకరించే పనిలో పడింది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితవ్యం కోసం విశేషంగా కృషి చేస్తుంది. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆ వెనువెంటనే ఉద్యోగాలు కల్పించేందుకు ‘ట్రెయిన్ అండ్ హైర్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి …
Read More »తెలంగాణ పాలిటిక్స్లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు!
నాలుగు సెక్షన్లు నాన్బెయిలబుల్ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు, A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్, A-3గా BLN రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది.తెలంగాణ పాలిటిక్స్లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. …
Read More »తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీన ఏ పరీక్షంటే
తెలంగాణ పదో తరగతి విద్యార్ధుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ …
Read More »కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందే.. హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వీరి పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో …
Read More »హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!
ఏ తల్లైన పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృహృదయంతో మురిసిపోతుంది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలిపించుకోవాలనుకుంటుంది. అయితే నిండి గర్భిణి అయిన హరిప్రియ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. కాన్పు సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తాను మాత్రం కనులారా చూడకుండానే తుదిశ్వాస విడిచింది.తన ఆయువునే మరో ప్రాణంగా మలిచింది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలుపునకు ఆమడ దూరంలో ఆగిపోయింది. ఆ గుండె మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా, తన …
Read More »మనల్ని ఎవడ్రా ఆపేది.. వరల్డ్లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్.. ఎందులో అంటే
2024లో పవన్ కళ్యాణ్ సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపారు పవన్. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారాలు, సభలు, మాటలు అబ్బో.. అప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించింది ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్.2024 ముగింపుకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే …
Read More »ఏడేళ్లలో 18,714 కిలోమీటర్ల హైవేల నిర్మాణం.. కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
అక్టోబర్ 31, 2024 నాటికి భారతమాల పరియోజన పథకం కింద కేంద్రప్రభుత్వం నాటికి మొత్తం 26,425 కి.మీ పొడవున హైవే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు భారతమాల పరియోజన కింద రూ. 4.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.భారతమాల పరియోజన పథకం కింద అక్టోబర్ 31, 2024 నాటికి మొత్తం 26,425 …
Read More »కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షల కాల్లెటర్లు వచ్చేశాయ్! డౌన్లోడ్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల అడ్మిట్ కార్డులు గురువారం (డిసెంబర్ 19) విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నియామక ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా 95,209 మంది అభ్యర్ధులు తదుపరి దశ అయిన దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. ఇక ఇప్పటికే పోలీసు నియామక మండలి పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది..ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షకు మార్గం సుగమం అయ్యింది. దేహ దారుఢ్య …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal