Blog Layout

ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..

ఆమె పేరు రమాదేవి..  సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది. వెంకట్రావుకి వివాహమై ఇద్దరూ పిల్లలున్నారు. రమాదేవి, వెంకట్రావులకు పెళ్లై పిల్లలున్నా వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దాదాపు ఇరవై ఏళ్ల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంక్‌లో తాకట్టు పెట్టించింది. అయితే ఇద్దరూ మధ్య ఎటువంటి …

Read More »

కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?

గతంలో ప్రచురితమైన అధ్యయనాన్ని సమీక్షించిన అనంతరం ఈ విషయం చెప్పింది. కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన ఈ అధ్యయన వివరాలు ‘ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. కాఫీ తాగడం వల్ల ఒకరి జీవితానికి అదనంగా ఆరోగ్యకరమైన మరో 1.8 సంవత్సరాలు కలుస్తాయని పోర్చుగల్ అధ్యయనకారులు తెలిపారు. ఆరోగ్యకరమైన, సమతుల జీవనశైలిలో కాఫీ ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా వృద్ధ దశకు చేరుతోందని.. ఈ నేపథ్యంలో ప్రజలు దీర్ఘకాలం జీవించడమే కాకుండా, ఆరోగ్యంగా జీవించేందుకు …

Read More »

 ‘బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’.. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..

పార్లమెంట్‌లో అదానీ -సోరోస్‌ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం సంచలనంగా మారింది.. రాజ్యసభలో తమకు మాట్లాడడానికి ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఆరోపించింది.. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఛైర్మన్‌గా ఉన్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌పై రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. …

Read More »

టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు పైశాచిక దాడి.. నిరసనకు జర్నలిస్ట్ సంఘాల పిలుపు

న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్‌ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ జర్నలిస్టులు కోరుతున్నారు. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీవీ9 జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ.. బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శాంతియుత నిరసనకు జర్నలిస్టులు పిలుపునిచ్చారు.  టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై దాడిని ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ …

Read More »

స్కానింగ్ సెంటర్‌ నుంచి కేకలు వేస్తూ బయటకు వచ్చిన యువతి.. ఆరా తీయగా

ఆమెకు యాక్సిడెంట్ కారణంగా గాయాలు అయితే వైద్యుడి వద్దకు వెళ్లింది. అక్కడ స్కాన్‌కు రిఫర్ చేశారు. స్కానింగ్ కోసం సెంటర్‌కు వెళ్లగా.. ఆమెకు భయానక అనుభవం ఎదరయ్యింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…విశాఖలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ కీచక బుద్ధి బయటపెట్టాడు. డాక్టర్ రిఫర్ చేసిన ఓ యువతి స్కానింగ్‌కు కోసం రావడంతో.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. అప్రమత్తమైన ఆమె బంధువులు.. …

Read More »

ఇక ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ షురూ.. ఏఐ, డీప్ టెక్‌లతో పౌర సేవలు

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వ్యవహారాల్లో భాగం చేసేందుకు సిద్ధమైంది. ఏఐ, డీప్‌టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురానుంది..అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకే చెందిన వార్త ఇది. ఏఐ, డీప్‌టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా …

Read More »

తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు నిఘా ఉండేలా విజిలెన్స్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెడుతోంది.తిరుమలలో ఇటీవల తరచూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీవారి ఆలయం సమీపంలో కొందరు చేస్తున్న హడావిడితో చాలామంది భక్తులు ఇబ్బందిపడుతున్నారు. టీటీడీ నిబంధనల్ని పట్టించుకోకుండా ఫోటో షూట్‌లు చేస్తున్న ఘటనలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో.. తిరుమలలో రీల్స్‌, వీడియో షూట్స్‌పై టీటీడీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. …

Read More »

భక్తులకు శుభవార్త.. స్పర్శ దర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం

స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు …

Read More »

మాకు పాఠాలు చెప్పండి మహాప్రభో.. ఉపాధ్యాయులపై విద్యార్థుల ఫిర్యాదు..!

ఉపాద్యాయులపై విద్యార్దుల ఫిర్యాదు చేశారు. సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ డీఈవోకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. స్కూల్‌కు వస్తున్నాం కానీ పాఠాలు వినడం లేదని, ఉపాధ్యాయులు పాఠాలు చెబితే ఎందుకు వినమని విద్యార్థులు ఉన్నతాధికారులకు రాసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.. మాకు పాఠాలు చెప్పండి మహా ప్రభో అంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆ పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్దులు ఆశ్రయించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలంలోని …

Read More »

వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అదేనా?

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో ఆయనకు భవిష్యత్తులో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి హామీని టీడీపీ నాయకత్వం ఇచ్చినట్టు ప్రచారం ఉంది. తాజాగా వంగవీటి రాధా, ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.రాజ్యసభ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత వంగవీటి రాధా, ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధా రాజకీయ భవిష్యత్తు, టీడీపీ వ్యూహాలపై ఈ భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. 2024 …

Read More »