ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుండి దూకడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హుటాహుటిన మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్కు ఎదురుగా ఉన్న జంగిల్ జంబోరీ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, …
Read More »Blog Layout
ఇలాంటి వారితో జాగ్రత్త.. ఫ్రెండ్షిప్ చేశారో బతుకు బస్టాండే! బీ కేర్ ఫుల్
నిత్యం మన జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. కానీ వీరిలో కొందరితోనే మనం కనెక్ట్ అవుతాం. మరికొందరిని దూరం నుంచే చూసి తప్పుకుంటారు. ఇంకొందరుంటారు.. ఇలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పొరబాటున ఫ్రెండ్ షిప్ చేశారో బతుకు బస్టాండే..ధన సముపార్జన ద్వారా ఏ మనిషీ జ్ఞాని కాలేడు. కొందరైతే ఉన్నత పదవుల్లో ఉండి చాలా సంపాదిస్తారు.. కానీ ఎప్పుడూ తెలివితక్కువ పనులు చేస్తుంటారు. ఈ కారణంగా వీరిని ఎల్లప్పుడూ మూర్ఖులుగా పరిగణించబడతారు. కాబట్టి మన చుట్టూ ఈ ఐదు గుణాలున్న వ్యక్తులు ఉంటే …
Read More »ఏఐ జమానా.. ఎగబడి కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులు
2024-25 అకడమిక్ సెషన్లో 4,538 పాఠశాలల నుండి దాదాపు 7,90,999 మంది విద్యార్థులు సెకండరీ స్థాయిలో (IX , X తరగతులు కలిపి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో (XI, XII తరగతులు కలిపి), 944 పాఠశాలల నుండి 50,343 మంది విద్యార్థులు AIని ఎంచుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. AI విద్య యొక్క ప్రాముఖ్యతను కేంద్రమంత్రి జయంత్ చౌదరి వివరించారు. 2019లో …
Read More »శ్రీశైలంలో కలకలం.. రాత్రివేళ కొండ పై నుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి బుర్రె వెన్నెల అనే యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి వెన్నెల ఆన్లైన్ లోన్ యాప్ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం కోసం నిన్న రాత్రి శిఖరం వద్ద చేరుకుంది. కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు వెంటనే స్పందించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం …
Read More »నేటితో 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. తెలుగు రాష్ట్రాలకు సంజీవిని
మానవమేదో వికాసానికి ప్రతీక. భారత దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక. శ్రమ శక్తిని రుజువు చేసిన కరదీపిక. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించిన అద్భుత నిర్మాణ సౌధం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. అసమానమైన రాతి కట్టడంగా రూపు దాల్చిన శ్రమ సౌధం. లక్షల మంది శ్రేయాన్ని అక్షయనం చేసిన శిలాక్షరమైన ఈ నవ దేవాలయానికి (డిసెంబర్ 10వ తేదీ) నేటితో 69 ఏళ్లు నిండి 70వ వడిలోకి అడుగపెట్టింది. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం …
Read More »గుమ్మం ముందే పసుపుతో ముగ్గు.. నిమ్మకాయలు, గుడ్లు.. ఏంటని చూస్తే గుండె జారినంత పనైంది..
పూజలు.. ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలియదు గానీ…వీటి పేరు విన్నా, వీటిని చూసిన ఎవరైనా వణికిపోతారు. మూఢనమ్మకాలను నమ్మే వారైతే వారికి ఇక నిద్రపట్టదు.. ముఖ్యంగా హర్రర్ మూవీలలో ఈ క్షుద్ర పూజలను మరి భయంకరంగా చూపిస్తారు. క్షుద్ర పూజలు ద్వారా ఎవరినైన లోబరుచుకోవటం, వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం, వారిని చావు అంచుల వరకూ తీసుకువెళ్ళడం వంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తూ ఉంటే ఇక ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మంత్ర, తంత్రాలు… నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు …
Read More »శ్రీకాకుళంలో విషాదం.. డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్కి గుండెపోటు..సీట్లోనే కుప్పకూలి..
రెప్పపాటు జననం..రెప్పపాటు మరణం అన్నారు పెద్దలు.. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతోన్న మరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండానే అకాల మరణాలు జరుగుతున్నాయి. చిన్నారులు, కాయ కష్టం చేసుకునే కస్టజీవులు సైతం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్లతో మరణిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్పేట జంక్షన్ వద్ద డ్రైవింగ్ చేస్తూ గుండె పోటుతో లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అయితే డ్రైవర్ మృతితో లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై భారీ విధ్వంసాన్ని …
Read More »ఏపీ కేబినెట్లోకి నాగబాబు.. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న మెగా బ్రదర్.
ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబు.. జనసేన తరపున మంత్రి వర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయనకు కేటాయించే శాఖల పై క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం …
Read More »ఒక్కసారిగా పతనమైన టమాటా ధర.. కేజీ ఎంతో తెల్సా..?
మొన్నటివరకు పై చూపులు చూసిన టమాటా ధర ఒక్కసారిగా దారుణంగా పతనమైంది. ఏకంగా కిలో టమాటా ఒక్క రూపాయికి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎక్కడో.. ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం…నిన్న మొన్నటి వరకూ టమాటా ఓ మోత మోగించింది. కొనాలంటేనే భయపడేలా చేసింది. సెంచరీ కొట్టి టమాటా సామాన్యులకు సవాల్ విసిరింది. ఆ తర్వాత.. చాలారోజుల వరకూ అరవై రూపాయలు.. కొద్దిరోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతోంది. అయితే.. మారుతున్న మార్కెట్ పరిస్థితులతో టమాటా రేటు చిన్నగా దిగొచ్చింది. కొంతకాలంగా హెచ్చుతగ్గులతో నడుస్తున్న టమాటా ధర.. …
Read More »మోహన్ బాబు ఇంటి చుట్టూ బౌన్సర్లు.. 30 మందిని దింపిన మనోజ్
మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ . మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి .మంచువారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్బాబు కుమారులు మంచు విష్ణు-మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal