తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది అధికార పార్టీ. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలను సభ సాక్షిగా తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ అవినీతిని అసెంబ్లీలో కడిగేస్తామంటోంది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది …
Read More »Blog Layout
ఇక అన్ని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు.. సీఎం రేవంత్ ఆదేశం
పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్లో విద్యాశాఖపై సమీక్ష …
Read More »యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన
తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ముందు గన్పార్క్లో నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్రావు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపగా.. మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ యూరియాపై ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్పార్క్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు …
Read More »గణపతి విగ్రహంతో పాటు రూ.5 లక్షల విలువైన బంగారం నిమజ్జనం.. కట్ చేస్తే..
హైదరాబాద్ శివారులో వినాయక నిమజ్జనం సందర్భంగా గిరిజ కుటుంబం ఐదు తులాల బంగారాన్ని విగ్రహంతో పాటు చెరువులో నిమజ్జనం చేయడంతో కలకలం రేగింది. నిమజ్జనం తర్వాత వారికి బంగారం విషయం గుర్తుకువచ్చింది..? ఆ తర్వాత వారు ఏం చేశారు..? బంగారం తిరిగి వారి చేతుల్లోకి వచ్చిందా..? తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు వినాయక నవరాత్రి సందడితో కళకళలాడిపోతున్నాయి. ఊరూరా మండపాలు వెలసి.. గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా హైదరాబాద్ శివారులోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని …
Read More »ఏపీలోని ఓ సాధారణ గ్రామంలో గణపతి లడ్డూ వేలం.. లక్షల్లో పలికిన ధర
ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో వినాయక మండపం వద్ద జరిగిన వేలం పాటలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. శుక్రవారం నిమజ్జనానికి ముందు లడ్డూ, కలశం కోసం ప్రత్యేకంగా వేలం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్రెడ్డి లడ్డూను భారీ ధరకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పండగ రోజున గణపతిని ఆరాధించిన తర్వాత, కొన్ని రోజులు గడిచాక నిమజ్జన శోభాయాత్రలు జరుగుతాయి. ఈ సందర్భంలో వినాయకుడి ప్రసాదంగా ఉంచిన లడ్డూలకు జరిగే వేలంపాటలు ప్రత్యేక …
Read More »కరెన్సీ నోట్ల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న వినాయకుడు.. ఎన్ని కోట్లను ఉపయోగించారంటే..
మంగళగిరి ప్రధాన వీధిలోని మండపంలో గణపతిని నోట్ల తో అందంగా అలంకరించారు. వ్యాపారులు తమ వద్ద నున్న నోట్లను ఇచ్చి కొత్త నోట్లను ముందుగానే తెచ్చుకుంటారు. నూతన కరెన్సీని మాత్రమే స్వామి వారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఎవరికి వారికి ఇస్తారు. సంకా బాలాజీ గుప్తా ప్రతి ఏటా ఈ అలంకరణను పర్యవేక్షిస్తారు. స్థానిక వ్యాపారులంతా సహకరిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం మంగళగిరిలోని వినాయకుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ప్రతి ఏటా ప్రధాన వీధిలోని ఏర్పాటు చేస్తున్న విగ్రహం …
Read More »మండపాల్లో వివిధ రూపాల్లో గణపయ్య.. ఆకట్టుకున్న ఆపరేషన్ సిందూర్, ఆపిల్, టెంకాయ గణేశ విగ్రహాలు..
దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంటిలో మాత్రమే కాదు వీధి వీధిలో గణపయ్య అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను అందుకుంటున్నాడు. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో రకరకాల రూపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రకరకాల వినాయక విగ్రహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ పండ్లతో చేసిన పెద్ద వినాయక విగ్రహం, ఆపరేషన్ సిందూర్ నేపధ్య గణపతి ఇలా అనేక రకాల విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. …
Read More »ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల.. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. …
Read More »ఇది లక్కీ భాస్కర్ సినిమా స్టైల్ మించిన మోసం.. మాస్టర్ మైండ్తో భారీ స్కామ్..!
లక్కీ భాస్కర్ సినిమా గుర్తుంది కదూ. అందులో జరిగే మోసం తెలుసు కదా. సరిగ్గా అదే స్టైల్లో భారీ స్కామ్లు వెలుగు చూశాయి. చాలా మంది డబ్బును బ్యాంక్లో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు. కానీ సిబ్బంది చేతివాటంతో బ్యాంకుల వైపు అనుమానంగా చూస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుంటే.. గద్దలు వచ్చి ఎగురేసుకుని పోయినట్లుంది. ఇప్పుడదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి..? దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు అంతర్గత మోసాలతో సవాళ్లను …
Read More »నో మొబైల్.. డ్రెస్ కోడ్ ఉంటేనే అమ్మవారి దర్శనం.. తిరుమల తరహాలో కఠిన నిబంధనలు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న కనకదుర్గమ్మను దర్శించాలంటే ఇక డ్రెస్ కోడ్ పాటించాల్సిందే.. మహిళలైనా, పురుషులైనా సరే నిబంధనలు తప్పనిసరి అంటున్నారు ఆలయ అధికారులు..తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలకు చీర, చున్నీతో కూడిన సల్వార్ కమీజ్, పురుషులైతే ధోతీ లేదా పైజామా, చొక్కా ధరించాలని పేర్కొంటున్నారు. తిరుపతి తర్వాత రెండో అతి పెద్ద ఆలయంగా ప్రశస్తి పొందిన ఇంద్రకీలాద్రిపై తిరుపతి తరహాలోనే అభివృద్ధి జరగాలని గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన శీనా నాయక్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal