Blog Layout

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేది ఇంకెన్నడో.. తప్పని నిరీక్షణ!

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో పాటు ఆయా సెట్ల పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటికే ఈఏపీసెట్, పీజీఈసెట్‌లతో సహా పలు సెట్ల షెడ్యూల్‌లను కూడా ఖరారు చేసింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాకపోవడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల నియామకంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. తెలంగాణలో కన్వీనర్ల నియామకంతోపాటు పరీక్షల షెడ్యూల్, దరఖాస్తుల …

Read More »

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది..రైల్వే శాఖలోని ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6, 2025వ తేదీతో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. …

Read More »

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసింది ఏపీ హోం శాఖ.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలు) ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ముందుగా ఇంగ్లీష్‌లో …

Read More »

రథసప్తమి.. సూర్యప్రభ వాహనంపై దేవదేవుని కటాక్షం..పరవశించిపోయిన భక్తజనం..ఆ ఫోటోలు ఇవిగో..

తిరుమల క్షేత్రంలో సూర్య జయంతి వేడుక ముగిసింది. రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వస్తున్న టిటిడి ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేడుక జరిపింది. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి 7 వాహన సేవలను అందుకున్నారు. తిరుమల క్షేత్రంలో 1564 నుండి రథసప్తమి జరుగుతోంది. రథసప్తమి పర్వదినాన్ని శాసనాధారాలు ఉండగా సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేసి రథసప్తమి ని వేడుకగా నిర్వహిస్తున్నారు. …

Read More »

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ కార్పొరేట్లకు అంతనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్‌టాటా. మనదేశంలో చూస్తున్న స్టార్టప్‌ విప్లవానికి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు. సంపదంతా సమాజ సేవకే అంకితం చేశారు.రతన్‌ టాటా కాదు ఆయన ‘రత్న’ టాటా. పుట్టుక పార్సీ అయినా పదహారణాల భారతీయుడు. స్కూల్‌ పుస్తకాల్లో కచ్చితంగా …

Read More »

ఆడపిల్లల పాలిట తోడేళ్లు.. మతి తప్పిన మదపిచ్చోళ్లు… ఒక్కోడు ఒక్కో టైపు

కామాతురాణాం నభయం నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి సిగ్గూ భయం రెండూ ఉండవు. మరి.. సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఎలా అనుకుంటాం.. ఎందుకు ఆశిస్తాం…? అక్షరం ముక్క రానివాడైనా.. మాస్టర్స్‌ డిగ్రీ చదివినవాడైనా.. అందరిదీ అదే బాపతు. ఎవ్వరికీ కనీస ఇంగితం లేదు. చట్టాలంటే భయం లేదు. ప్రస్తుతానికి తెలుగురాష్ట్రాల్లో ఓ నలుగురు కామోన్మాదులపై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది. మతితప్పి, మదమెక్కిన కామ పిశాచుల స్వైరవిహారం సమాజంలో ఏ రేంజ్‌లో నడుస్తోందో తెలుస్తోంది.వందమంది అమ్మాయిలే నా టార్గెట్‌ అంటాడొకడు. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే …

Read More »

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు

తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి.. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు పదివేల కోళ్లు మృతి చెందుతున్నాయి.ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతుంది. కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 40 లక్షల …

Read More »

మొండితనం వద్దు.. పట్టు విడుపు ధోరణి ముద్దు.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హితవు

విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరించింది. వచ్చే భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చెప్పినట్టు తెలిసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటింది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ …

Read More »

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్.. అలా చేస్తే కఠిన చర్యలే..

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్. నిర్మాణాలకు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు పలు కీలక విషయాలు ప్రస్తావించింది పురపాలకశాఖ. 300 చ.మీ. భూమిలో నిర్మాణాలకు యజమానులే.. ప్లాన్‌ ధృవీకరించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. పలు మార్గదర్శకాలను పురపాలక శాఖ జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతులపై  చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలిచ్చింది. సీఆర్డీఏ …

Read More »

ఆళ్లగడ్డలో అన్నాచెల్లెల్లు ఢీ అంటే ఢీ

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ వివదాలు ఆగడం లేదు. తాజాగా భూమా అఖిలప్రియపై భూమా కిషోర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలప్రియ అరాచకాలపై చర్చకు సిద్ధమని కిషోర్‌రెడ్డి సవల్ విసిరారు. ఆయన కామెంట్స్‌పై అఖిల ప్రియ సైతం అంతేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.ఆళ్లగడ్డలో అన్నాచెల్లెల్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. చూసుకుందాం.. తేల్చుకుందాం… అవసరమైతే చర్చకైనా సిద్ధమంటూ పొలిటికల్‌ హీట్‌ పెంచారు. దీంతో ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ తెగ టెన్షన్‌ పడుతున్నారు పోలీసులు. ఆళ్లగడ్డలో భద్రత మరింత పెంచారు. …

Read More »