Blog Layout

మహిళా రోగిపై వార్డుబాయ్‌ అత్యాచారయత్నం… విద్యానగర్‌ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో దారుణం

మహిళలకు బయటే కాదు.. ఆస్పత్రుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బెడ్‌ మీద చికిత్స తీసుకుంటున్న రోగులను కూడా కామాందులు వదలడం లేదు. హైదరాబాద్‌లో నగరం నడిబొడ్డున ఉన్న ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.పేషెంట్‌పై అత్యాచారయత్నం చేశారు వార్డ్ బాయ్. మహిళా అరుపులతో వెంటనే అప్రమత్తయ్యారు సిబ్బంది. విద్యానగర్‌లోని ఆంధ్రా మహిళా సభ ఆస్పత్రిలో చోటు చేసుకుంది ఈ దారుణం. మహిళా పేషెంట్‌పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలతో బంధువులు అప్రమత్తమయ్యారు. వార్డ్ బాయ్‌ని చితకబాదారు బాధితురాలి కుటుంబ సభ్యులు. అనంతరం …

Read More »

తెలంగాణలో NIE అవగాహన కార్యక్రమం.. ఉప్పు విషయంలో ఆ తప్పు వద్దు అని..

 ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) పరిశోధకులు పంజాబ్, తెలంగాణలో మూడు సంవత్సరాల ఉప్పు తగ్గింపు చొరవను ప్రారంభించారు. ICMR మద్దతుతో ఉన్న ఈ ప్రాజెక్ట్, సోడియం తీసుకోవడం తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కమ్యూనిటీ నేతృత్వంలోని ఆహార సలహా ప్రభావాన్ని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నప్పటికీ, పట్టణ భారతీయులు రోజుకు 9.2 గ్రాములు వినియోగిస్తున్నారు. ఇది సూచించిన పరిమితి కంటే దాదాపు …

Read More »

భయపెడుతున్న భవిష్యవాణి.. మహమ్మారి ముప్పు, అగ్నిప్రమాదాలు ఎక్కువే..

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తానని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారు. ప్రతి సారి …

Read More »

రక్తమోడిన రోడ్డు.. 8 మంది మృతి! మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. స్పాట్‌లోనే ఏడుగురు

కష్టపడి పనిచేసి మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయానికి వారిని మృత్యువు వెంటాడింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో దానిపై ఉన్న కూలీలు అంతా లారీ కింద పడ్జారు. వారిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లి నుంచి మామిడికాయల లోడుతో రైల్వేకోడూరు మార్కెట్ యార్డుకు వెళుతున్న ఐచర్ వాహనం అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి లోని చెరువు కట్ట వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న …

Read More »

అప్పులపాలయ్యా.. నా కారు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

నియోజవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని అన్నారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారని.. ప్రస్తుతం తన అల్లుడి కారును వాడుతున్నానన్నారు. ‘‘గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా’’.. అంటూ తూర్పు గోదావరి జిల్లా …

Read More »

భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు గమనించాల్సిన విషయం ఇది. జలాశయం నిండడంతో భక్తుల రద్దీ పెరగడంతో.. ఈ వారం మధ్యాహ్నం సమయంలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ప్రకటించింది. పరిస్థితిని భక్తులు అర్థం చేసుకోవాలని కోరింది . ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం (మంగళవారం నుండి శుక్రవారం వరకు) ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో జలాశయం నిండుకుండలా …

Read More »

ఇక నుంచి రైళ్లలో ఏం జరిగినా తెలిసిపోతుంది.. రాత్రి వేళల్లో కూడా.. ఎలానో తెలుసా?

సాధారణంగా పట్టణాల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు ఈజీగా వాళ్లను పట్టుకుంటారు. కానీ రైళ్లలో దొంగతనాలు జరిగితే వాళ్లను పట్టుకొవడం రైల్వే పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో ప్రయాణికులు పొగొట్టుకున్న వాటిని తిరిగి రికవరీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రైన్స్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటి సహాయంతో ట్రైన్‌లలో దోపిడీలకు పాల్పడే వారిని గుర్తించొచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దోపిడీ దొంగల బీభత్సం. ప్రయాణికులను …

Read More »

బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు.. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌గా ఎంపిక

బొబ్బిలి వీణకు మరో జాతీయ గౌరవం లభించింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించిన గుర్తింపు ఈ కళకు నూతన ఊపిరిగా నిలవనుంది. రాజుల కాలం నుంచి తరతరాలుగా సాగుతున్న ఈ హస్తకళ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి వినిపించబోతోంది. చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపిక అయ్యింది. ఈ అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ …

Read More »

గుడ్‌న్యూస్.. అమరావతిలో రూ.2,200 కోట్లతో బిట్స్‌ క్యాంపస్ ఏర్పాటు.. అధికారికంగా ప్రకటించిన కేఎమ్‌ బిర్లా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదికగా మారుతోంది. ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతిలో బిట్స్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో, డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్‌తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 7000 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ క్యాంపస్ నిర్మిస్తామని ఆయన …

Read More »

ఈనెల 26న సింగపూర్‌కు చంద్రబాబు బృందం – ఎందుకో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ టూర్‌ ఖరారైంది. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనుంది. అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు …

Read More »