Blog Layout

రేపే సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ.. భయంతో హడలెత్తిపోతున్న భక్తులు! ఎందుకంటే..

సింహాచలంలో వరుస ప్రమాదంలో భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనలో.. ఏడుగురు భక్తులు ప్రాణాల కోల్పోయిన ఘటన మరువక ముందే గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కొండ దిగువున భారీ రేకుల షెడ్డు కూలిపోవడం భయాందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తు భక్తులెవరు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెనుముప్పే తప్పింది. అయితే.. సింహాచలంలో తాత్కాలిక నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు.. విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏర్పాట్లు ముమ్మరం …

Read More »

ఇంటర్‌ పాసైన పేదింటి విద్యార్ధులకు బంపరాఫర్.. ఏడాదికి రూ.20 వేల స్కాలర్‌షిప్‌ ఛాన్స్!

పేదింటి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పోత్సహకంగా ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USP Yojana) కింద స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. ఈ పథకం కింద అండర్‌ గ్రాడ్యుయేట్లకు మొదటి 3 సంవత్సరాలకు ఒక్కో ఏడాది రూ.12 వేలు, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్‌కు రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు.. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్ధుల చదువులకు చేయూత ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USP Yojana) కింద సెంట్రల్‌ సెక్టార్ …

Read More »

బ్యాంకులో దుర్గమ్మ బంగారం డిపాజిట్.. ఎన్ని కిలోలు.. విలువ ఎంతంటే..?

బెజవాడ దుర్గమకు భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో దుర్గమ్మ బంగారాన్ని అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. 29.5 కిలోల బంగారాన్ని అధికారులు ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా భక్తులకు మరో గుడ్ న్యూస్‌ను కూడా ఆలయ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు బ్యాంకులో డిపాజిట్ …

Read More »

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని.. మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిందో భార్య. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లెలో జులై 2న ఈ ఘటన జరగ్గా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెలో చంద్రశేఖర్ అనే వ్యక్తి జులై 2వ తేదీ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో చంద్రశేఖర్‌ను హత్య చేసింది అతని భార్య రమాదేవిగా తేలింది. ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడన్న …

Read More »

ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత , జౌళీ శాఖ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం ఈ కింద తెలుసుకుందాం.. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత …

Read More »

ఆపరేషన్ సింధూర్‌తో పెళ్లి వాయిదా.. ఆ ముచ్చట తీరకుండానే ఇలా..! ఆర్మీ జవాన్ కథ తెలిస్తే..

ఆపరేషన్ సిందూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు తుపాకి పేలి బాపట్ల జిల్లా చిలకాలవారిపాలెంకు చెందిన రవి కుమార్ అనే జవాన్ రాజౌరీలో చనిపోయాడు. చేతిలో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అవ్వడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. రాజౌరీలో విధుల్లో ఉండగా చేతిలో ఉన్న గన్‌ మీస్‌ఫైర్ అవ్వడంతో …

Read More »

వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని.. …

Read More »

 తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రా అబ్బాయి సత్తా.. రిజల్ట్స్‌ను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి..

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి …

Read More »

ఇక ఇండియాలోనే.. అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్‌తో డిఫెన్స్ దద్దరిల్లాల్సిందే

IAF అవసరాలకు అనుగుణంగా మల్టీ- రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ లో భాగంగా మొత్తం 114 Su-35M ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న Su-30MKIతో పోల్చితే.. Su-35Mలో దాదాపు 70-80% సాంకేతిక సామాన్యత ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కాదు.. సైనిక శక్తిలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. భారత్‌తో సరిహద్దులు పంచుకుంటూ శత్రువైఖరిని ప్రదర్శిస్తున్న చైనా, పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే 5వ తరం యుద్ధ విమానాలను కలిగి ఉండగా.. …

Read More »

ఒకే ఒక అస్తికయినా ఇవ్వండి – 8 మంది కార్మికుల కుటుంబాల ఆవేదన

కార్మికుల అవశేషాలను గుర్తించేందుకు NDRF, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి.. 70కిపైకి శాంపిల్స్‌ను DNA రిపోర్ట్‌ల కోసం అధికారులు పంపించారు. 8 మంది ఆచూకీ గుర్తించడంలో DNA రిపోర్ట్‌లు కీలకంగా మారనున్నాయి. ఐలా సెంటర్ దగ్గర తమ వారి కోసం 8 రోజులుగా కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. సిగాచి పరిశ్రమ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు. ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులు అగ్నికి ఆహుతి అయ్యారు. చెట్టంత …

Read More »