Blog Layout

తల్లిదండ్రుల ఆస్తులు కొడుక్కి రాకుండా చేయొచ్చా? సుప్రీం ఇచ్చిన తీర్పు ఇదే

ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక అంశంపై విచారణ జరిపింది. తమ కొడుకు పేరును ఆస్తి వాటా నుంచి తొలగించేందుకు తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. తమ బాగోగులు చూడటంలో నిర్లక్ష్యం వహించి, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే, మార్చి 28న సుప్రీంకోర్టు ఆ వృద్ధ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, 2019లో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పించింది. తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి ఏ …

Read More »

మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు.. పిల్లర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్నది అవాస్తవం- జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ మ‌హాన‌గ‌రానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేద‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఆయ‌న జ‌ల‌మండ‌లి ఉన్నతాధికారుల‌తో కలిసి మంజీరా బ్యారేజ్, గేట్లు, పిల్లర్లు, పంప్‌హౌజ్‌ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచినీరు అందించడానికి నిర్మించిన మంజీరా బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేద‌ని స్పష్టం చేశారు. అలాగే బ్యారేజ్‌కి సంబంధించిన గేట్లు, రోప్‌ల ప‌నితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయితే బ్యారేజ్  దిగువ‌న ఆఫ్రాన్ కొంత‌మేర‌కు దెబ్బతిన్నద‌ని వెంట‌నే మ‌రమ్మత్తుల‌కోసం …

Read More »

 ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ఖరారు చేసిన అధిష్ఠానం!

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్క వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం( 01-07-2025) అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్‌ …

Read More »

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే.. జులై 7 వరకు రిజిస్ట్రేషన్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి సంబంధించి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలో ర్యాంకు పొందిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. మొత్తం 3 విడతల్లో ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 7 వరకు కొనసాగుతుంది. స్లాట్ బుకింగ్, పేమెంట్ ఆన్‌లైన్‌ విధానంలో చేయవల్సి ఉంటుంది. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జులై 6 …

Read More »

అయ్యో భాస్కర్.. మళ్లీ పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్.. ఆందోళనలో అధికారులు..

బుసలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు.. విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు.. అతడే పాముల భాస్కర్‌గా గుర్తింపు పొందిన భాస్కర్‌నాయుడు. ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురయి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్‌నాయుడు.. మరోసారి పాముకాటుకు గురయి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు టీటీడీ అధికారులు.ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్‌ నాయుడు.. స్నేక్ క్యాచర్‌గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం, నైపుణ్యం ఈయన సొంతం. తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ …

Read More »

వాయిదాపడిన ఆ డీఎస్సీ పరీక్షలు రేపట్నుంచే..! హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేశారా..?

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అయితే గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 30వ తేదీతో ఆంటే ఈ రోజుతో పరీక్షలు ముగియవల్సి ఉంది. అయితే యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను కూటమి సర్కార్‌ వాయిదా వేసింది. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చుతున్నట్లు ఇప్పటికే …

Read More »

జాబ్‌ పోయినా ఉన్నట్టే నటించాడు.. అబద్ధంతో అంతకు మించిన జాబ్‌ కొట్టాడు.. ఇంతకు అతనెవరో తెలుసా?

ఉన్నపలంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఏం చేస్తారు.. మరో ఉద్యోగం వెతుక్కుంటారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం ఉద్యోగం పోయినా ఉన్నట్టు నటించి.. లింక్‌డిన్‌లో ఫేక్‌ ప్రాజెక్టు పోస్ట్‌లు పెడుతూ పోయిన ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగాన్ని సంపాధించాడు. వివరాళ్లోకి వెళితే.. రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక యూజర్ ఒక పోస్ట్‌ చేశాడు. అందులో తన జీవితంలో ఎదురైన ఓ విచిత్ర సందర్భం గురించి ఇలా వివరించాడు. గత ఆగస్టు నెలలో తనను అనుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారని.. కనీసం ఎటువంటి …

Read More »

కర్ణాటక సీఎం మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత కీలక ప్రకటన..

కర్ణాటకలో మరోసారి సీఎం మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీఎం పదవి దక్కుతుందంటూ కొంతకాలంగా ఆ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఇదే విషయాన్ని తెరపైకి తీసుకురావండం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కర్ణాటక సీఎం కూర్చి వార్తల్లో నిలిచింది. మరో రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్‌ కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందంటూ బాంబు పేల్చారు.. అంతేకాకుండా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ …

Read More »

ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లో నగరాల అభివృద్ధికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, స్పష్టత నగర పాలనకు కొత్త ప్రాణం పోస్తోంది. తాజాగా ఆయన ఉండవల్లి నివాసంలో మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, మున్సిపాలిటీలపై పెట్టుబడుల పరంపర ఏపీ పట్టణాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి, డబుల్ ఇంజిన్ సర్కార్‌గా ఉండడం …

Read More »

ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం – స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు ఫలించాయ్. స్టయిఫండ్ పెంచేందుకు సర్కార్‌ ఓకే చెప్పడంతో వెనక్కి తగ్గారు జూడాలు. స్టైఫండ్‌ను పెంచడంతోపాటు అన్ని మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే స్టయిఫండ్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది వైద్య విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచినట్లైంది. 15 శాతం స్టైఫండ్ పెంపుతో ఇంటర్న్‌లకు …

Read More »