కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్కు పెట్టగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో అక్కడే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకట లక్ష్మమ్మ ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ రాత్రి ఛార్జింగ్ కోసం ఉంచారు. అయితే.. ప్రమాదకరంగా వాహనం పేలడంతో సమీపంలో ఉన్న ఆమెకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలకు దారితీసింది. వీటిని సరైన …
Read More »Blog Layout
చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!
ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధ ప్రయాణీకుడిపై మహిళా కండక్టరు దాడి చేసిన సంఘటన గురువారం తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్కు రూ.200 నోటు ఇవ్వగా.. పెద్ద నోటు ఇస్తే ఎట్లా? అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. …
Read More »అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి
23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఆమె.ఇటీవలె శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు మన తెలుగుమ్మాయి కూడా అంతరిక్ష యాత్ర చేయనుంది. అది కూడా అతి చిన్న …
Read More »మరోసారి సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
సీఎం సీటుపై మరోసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లు సీఎంగా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రజల ముందు అప్పీల్ పెట్టుకున్నారని.. ఆయన దిగిపోయిన తర్వాత (9 ఏళ్ల) ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై కూడా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం సీటుపై మరోసారి …
Read More »కజకిస్తాన్ రాయబారితో నవాబ్ మీర్ కీలక భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య.. హైదరాబాద్లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారుడు డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్ను కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన కజకిస్తాన్ రాయబారి.. ఏపీ, …
Read More »శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో ఆటలు.. ఆన్లైన్లో పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్స్!
తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్లైన్లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లో ఈ యాప్ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్ను డిజైన్ చేసి.. శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా …
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …
Read More »ISSతో ఫాల్కన్-9 వ్యోమనౌక డాకింగ్ విజయవంతం.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా
అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్సెంటర్లో చేపట్టిన ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్లో అడుగుపెట్టగానే జైహింద్.. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నా భుజాలపై త్రివర్ణ పతాకం …
Read More »డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ పవర్ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు. ఇక్కడ శక్తివంతమైన సర్కార్ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉంటే.. మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ పవర్ …
Read More »వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal