Kadam
September 15, 2025 ఆంధ్రప్రదేశ్
138
ఉత్తర తెలంగాణ దాని సమీపంలోని విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర తెలంగాణ, మధ్య విదర్భ దాని పరిసరాలలో ఉత్తర దిశలో బలహీనపడే అవకాశం ఉంది. ఈ రోజు అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు నాన్స్టాప్ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు …
Read More »
Kadam
September 15, 2025 ఆంధ్రప్రదేశ్, కర్నూలు
153
నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి అర్ధ రూపాయి కూడా పలకడం లేదని.. కిలో 30 పైసలు మాత్రమే ఉందని పేర్కొంటున్నారు.. ప్రస్తుతం మార్కెట్ కు భారీగా ఉల్లి వస్తోంది.. క్వింటాల్ ఉల్లి 1200లకు కొనుగోలు చేస్తున్న మార్క్ఫెడ్.. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం …
Read More »
Kadam
September 15, 2025 ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్
122
మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్ట్లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను (సెప్టెంబర్ 15) ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్పీ అధికారిక వెబ్సైట్లో https://apdsc.apcfss.in/ తుది ఎంపిక జాబితాను విడుదల …
Read More »
Kadam
September 13, 2025 జాతీయం
119
మణిపూర్ను శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లలో అట్టుడికిన మణిపూర్లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు. చురాచంద్పూర్లో, హింస తర్వాత నిరాశ్రయులైన ప్రజల కుటుంబాలను ప్రధాని మోదీ కలిశారు. దీనితో పాటు, ప్రధాని మణిపూర్కు రూ.8500 కోట్ల …
Read More »
Kadam
September 13, 2025 ఆంధ్రప్రదేశ్
187
బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి.. ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య & దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం శనివారం 13 సెప్టెంబర్ 2025 IST 0830 గంటలకు విస్తరించి కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మట్టం ఎత్తుతో నైరుతి దిశగా …
Read More »
Kadam
September 13, 2025 క్రైమ్, తెలంగాణ
119
ప్రజల్లో ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకాన్ని వమ్ము చేసే ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఎస్బీఐ గోల్డ్ లోన్ గోల్మాల్ ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలోని ఎస్బీఐలో మరో గోల్డ్ లోన్ గోల్ మాల్ వ్యవహారం బట్టబయలైంది. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా ఆడిట్లోనే అక్రమాల భాగోతం బయటపడింది. నిర్మల్ లోనూ ఇంటి దొంగే బ్యాంకుకు కన్నం వేసి 20 లక్షల రూపాయలకు పైగా స్కామ్కు పాల్పడ్డాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో బ్యాంకు మోసం బట్టబయలైంది. మంచిర్యాల …
Read More »
Kadam
September 13, 2025 అంతర్జాతీయం, బిజినెస్
119
జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు పెంచడం, రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించడం గురించి చర్చ జరిగింది. అమెరికా తన మిత్రదేశాలకు రష్యన్ చమురు దిగుమతిని నిరోధించడానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్కు ఆర్థిక సహాయం అందించడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే అంశం కూడా చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు జీ7 దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో తన మిత్ర దేశాలకు అమెరికా ఒక కీలక పిలుపు ఇచ్చింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏడు దేశాల …
Read More »
Kadam
September 13, 2025 జాతీయం
144
భారత ప్రభుత్వం గిరిజన భాషలను కాపాడేందుకు ‘ఆదివాణి’ అనే AI ఆధారిత అనువాద యాప్ను ప్రారంభించింది. ఇది గిరిజన భాషలను ఇతర భాషలకు అనువదించడానికి సహాయపడుతుంది. కమ్యూనికేషన్ లోని అంతరాలను తగ్గించడం, గిరిజన సంస్కృతి ని సంరక్షించడం ఈ యాప్ లక్ష్యం. మన దేశంలో ఎన్నో భాషల ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన చాలా భాషలకు లిపి కూడా లేదు. అంత మాత్రానా అవి తక్కువని కాదు. కానీ, తక్కువ మంది మాట్లాడే భాషలుగా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన సమాజం …
Read More »
Kadam
September 13, 2025 తెలంగాణ
132
తెలంగాణలో ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు ఉన్న డిమాండ్ను చూపిస్తూ, ఖైరతాబాద్ RTO వేలంలో రూ.63,77,361 ఆదాయం సమకూరింది. హెటెరో డ్రగ్స్ రూ.25,50,200 చెల్లించి TG09J 9999 నంబర్ను దక్కించుకుంది. ఇతర సంస్థలు, వ్యక్తులు కూడా లక్షల్లో ఖర్చు చేసి ప్రత్యేక నంబర్లను కొనుగోలు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. కొంతమంది లక్కీ నంబర్ల కోసం, మరి కొంతమంది సీరియల్ నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. లక్షలు పెట్టి కొన్న తమ వాహనానికి …
Read More »
Kadam
September 13, 2025 క్రైమ్, తెలంగాణ
123
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ …
Read More »