TimeLine Layout

August, 2024

  • 3 August

     ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ స్టాక్.. అప్పుడు 99 శాతం పతనం.. ఇప్పుడు రోజూ అప్పర్ సర్క్యూటే!

    Reliance Power Stock: దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్లో అనిల్ అంబానీ కూడా ఒకరు. రిలయన్స్ గ్రూప్ అధినేత అయిన ఒకప్పుడు భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ఉండేవారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అనిల్ అంబానీ సోదరుడు ముకేశ్ అంబానీ కంటే కూడా ఈయన సంపదే ఎక్కువగా ఉండేది. అయితే కాలక్రమేణా అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ సంపద క్రమంగా పతనం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట అనిల్ అంబానీ దివాళా స్థితికి చేరారు. ఆయన కంపెనీలన్నీ నష్టాల్లోకి మళ్లాయి. దీంతో పలు స్టాక్స్ …

    Read More »
  • 3 August

    నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారి.. ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం

    తెలంగాణలో రహదారుల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్-విజయవాడ హైవేను 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్-బెంగళూరు హైవేను కూడా విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 63వ నెంబర్‌ నేషనల్ హైవే విస్తరణ చేపట్టనున్నారు. ఈ హైవే విస్తరణలో కీలకమైన అలైన్‌మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భూ సేకరణకు వీలుగా తాజాగా ప్రజాప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌ నుంచి …

    Read More »
  • 3 August

    ఆడపిల్లల కోసం కేంద్రం స్కీమ్.. పాప పెళ్లి వయసుకల్లా చేతికి రూ. 70 లక్షలు.. నెలకు ఇంత కడితే చాలు..!

    ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దాదాపు అన్ని వర్గాల వారి కోసం, వారి సంక్షేమానికి కొత్త కొత్త పథకాల్ని ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 2014లో NDA అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్‌లో భాగంగా.. సుకన్య సమృద్ధి అకౌంట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేలా.. దీర్ఘకాలంలో వారు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవాలన్న ఉద్దేశంతో ఈ …

    Read More »
  • 3 August

    శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం.. హుండీలో విదేశీ కరెన్సీ.. బంగారం, ఎన్ని కోట్లంటే!

    శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్‌, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్‌ రియాల్స్‌, 90 థాయిలాండ్‌ …

    Read More »
  • 3 August

    భారీగా పెరిగి షాకిస్తున్న బంగారం ధరలు..

    మీరు బంగారం కొంటున్నారా? ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గోల్డ్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన తర్వాత గోల్డ్ రేట్లు వరుసగా భారీగా పడిపోయాయి. కస్టమ్స్ సుంకాన్ని ఒక్కసారిగా 15 శాతం నుంచి 9 శాతం తగ్గించి.. 6 శాతానికి చేర్చింది. దీంతో ఆరోజే బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 2700కుపైగా, 24 క్యారెట్లపై రూ. 3 వేలు తగ్గింది. తర్వాత రెండు రోజులు కూడా భారీ మొత్తంలో పతనమైంది. ఈ క్రమంలోనే వారం వ్యవధిలో పసిడి ధర …

    Read More »
  • 3 August

    అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌.. మొబైల్స్‌పై 40 శాతం డిస్కౌంట్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్‌లో పొందొచ్చు!

    స్మార్ట్‌ఫోన్‌, టీవీలపై డిస్కౌంట్‌ ఎదురుచూస్తున్న వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్‌ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సంస్థ.. అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Freedom Festival Sale) నిర్వహించనుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ సేల్‌ జరగనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, …

    Read More »
  • 3 August

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

    ఏపీకి  వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల 6 వరకు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు …

    Read More »
  • 3 August

    ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, చంద్రబాబు కీలక ప్రకటన

    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌరసరఫరాలశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్‌ బియ్యం సరఫరా, డోర్‌ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ షాపుల ద్వారా అనేక రకాల సరకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. …

    Read More »
  • 3 August

    ఆరోగ్యం విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (ఆగస్టు 3, 2024): మేష రాశి వారికి ఈ రోజు అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి. మేషం (అశ్విని, …

    Read More »
  • 2 August

    ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల …

    Read More »