TimeLine Layout

July, 2025

  • 9 July

    టీటీడీ ఏఈవో రాజశేఖర్‌ బాబుపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!

    తిరుమల తిరుపతి దేశస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. రాజశేఖర్ బాబు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఈవో శ్యామలరావు అతన్ను సస్పెండ్ చేశారు.  కాగా తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే ఇతను ప్రతీ ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని.. అక్కడ ప్రార్థనల్లో పాల్గొంటున్నారని స్థానిక భక్తల నుంచి టీడీకి విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై  విచారణ జరిపిన …

    Read More »
  • 9 July

    ఇవాళ చిత్తూరు జిల్లాలో జగన్‌ పర్యటన… బంగారుపాళ్యం మామిడిమార్కెట్‌ను సందర్శించనున్న వైసీపీ బాస్‌

    ఏపీలో మామిడిపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగేందుకు వైసీపీ అధినేత ఇవాళ చిత్తూరు వెళ్తున్నారు. బంగారుపాళ్యం మామిడిమార్కెట్‌ను జగన్‌ సందర్శించనున్నారు. జగన్‌ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది పోలీస్‌ శాఖ. మ్యాంగో మార్కెట్‌లో 500 మందికి మాత్రమే అనుమతించారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. రోడ్‌షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు ఎస్పీ. షరతులు ఉల్లంఘిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్‌ ఆంక్షలపై వైసీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. …

    Read More »
  • 9 July

    ఈదురుగాలులు బాబోయ్‌.. జరభద్రం! నేడు, రేపు వానలే వానలు..

    ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు తెలంగాణలోని …

    Read More »
  • 9 July

    ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టార్గెట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్‌.. సీఎం చంద్రబాబు సీరియస్!

    వైసీపీ నేతలపై తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టార్గెట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంత చేసినా వైసీపీ …

    Read More »
  • 9 July

    ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

    ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మంత్రిమండలి భేటీ కానుంది. క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌నుంది. ప్రభుత్వం ఇప్పటికే 54,000 ఎకరాల భూమిని సేకరించింది. మరో 20 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇవాళ్టి క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. రాజధాని అమరావతిలో 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెల‌ప‌నుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు …

    Read More »
  • 9 July

    పదో తరగతి అర్హతతో 2119 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏయే పోస్టులున్నాయంటే?

    న్యూఢిల్లీలోని ఢిల్లీ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB).. 2025-26 ఏడాదికి సంబంధించి గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ శాఖలలో, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలలో మొత్తం 2119 టీచింగ్‌, మెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద …

    Read More »
  • 9 July

    32 కిలోమీటర్ల సింహాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం.. అప్పన్న సన్నిధిలో లక్షలాది భక్త జన సంద్రం

    ఈ రోజు (జులై 9) సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి గిరిప్రదక్షిణం ప్రారంభమైంది. స్వామి వారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్త జనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు.. గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రారక్షణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా …

    Read More »
  • 9 July

    సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్ష తేదీ మారిందోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

    సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ (CSIR UGC NET 2025) జూన్‌ 2025 పరీక్ష తేదీ మారింది. ఈ మేరకు పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఇచ్చి షెడ్యూల్‌ ప్రకారం.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జులై 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సింది ఉంది. అయితే అదే రోజు హరియాణా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (HTET 2025) ఉన్నట్లు తేలింది. దీంతో ఒకే రోజున రెండు పరీక్షలు ఉండటంతో కొందరు …

    Read More »
  • 9 July

    భద్రాద్రి రామయ్య భూములపై మరోసారి రగడ.. ఈవోపై గ్రామస్థుల దాడి.. అసలేం జరిగిందంటే..

    ఏపీ, తెలంగాణ మధ్య భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరింత ముదిరింది. ఏకంగా.. ఆలయ అధికారులపై దాడుల వరకు వెళ్లింది. ఎస్‌.. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన భూముల వ్యవహారం మరోసారి కాక రేపింది. ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఆలయ అధికారులను పురుషోత్తపట్నం గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా …

    Read More »
  • 9 July

    పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ చూస్తే మతిపోవాల్సిందే!

    పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల చిన్నారి అంబటి ఖశ్వి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల వయస్సున్న అంబటి ఖశ్వి ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను …

    Read More »