విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!

హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలు, ఉద్యోగ ఆఫర్ లేటర్లతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీలసులు పట్టుకున్నారు. ఈ మోసాలకు పాల్పడుతున్న నలుగురిలో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 9 పాస్ట్‌పోర్టులు, 5నకిలీ విసాలు, రెండ్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

విదేశాలకు వెళ్లడం, అక్కడ ఉద్యోగాలు చేయడం చాలా మంది విద్యార్తుల కల. ఇలా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఉద్యోగ అవకాశాలు ఆశచూపి వాళ్లను నట్టేట ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ముఠానే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాచారంకి చెందిన నసీమా బాను అనే ఓ మహిళ, సయ్యద్ అదిల్ 23, ఫాతిమా, రేఖా అనే మరో ముగ్గురు కలిసి ముఠాలా ఏర్పడి తార్నాకలో వరల్డ్ వైడ్ ఓవర్సీస్ అనే కన్సల్టెంట్స్ ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యా విదేశాల్లో ఉద్యగాలు, వీసాలు తక్కువ ఖర్చుతో ఇప్పిస్తామని సోషల్ మీడియా మాద్యామాల్లో ప్రచారం చేశారు.

వాటిని చూసి వీరిని సంప్రదించిన కొంత మంది నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.35 లక్షల వరకు వసూలు చేశారు. చెప్పిన మాట ప్రకారం తమ దగ్గరకు వచ్చిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినట్టు నకిలీ ఆఫర్ లేటర్లు, ఫేక్ వీసాలు ఇచ్చారు. అయితే వీరు ఇచ్చిన ఆఫర్ లేటర్లు, వీసాలు నకిలీవని గుర్తించిన బాధితులు తము డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక తమ అసలు రూపం బయటపడంతో చేసేదేమి లేక డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన ముఠా ఇవాళ , రేపు అంటూ కాలం గడుపుతూ ఉన్నపలంగా అక్కడి నుంచి దుకాణం సర్దేశించింది.

దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లాలాగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లలా గూడ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితులు నసీం బాను, అదిల్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి 9 ఇండియన్ పాస్ పోర్టుల, 5 నకిలీ వీసా కాపీలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని లలా గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

About Kadam

Check Also

అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *