ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు.
సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాము..మీ దగ్గర హవాలా డబ్బు ఉంది హవాలా వ్యాపారం చేస్తున్నారు..సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు..ఖమ్మం జిల్లా వైరాలో ఓ రిటైర్డు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువులకు తెలియడంతో వెంటనే బాధితుడితో కలిసి వైరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు…
గత శుక్ర, శనివారాల్లో ఈ సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో బాధితుడు ఊటుకూరి నర్సింహారావు భయంతో హడలెత్తి పోయారు. వైరా మున్సిపాలిటీ 13వ వార్డు ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఊటుకూరి నర్సింహారావు ఈ సైబర్ నేరగాళ్ల బాధితుడయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపురంలోని ఓ పేపర్ బోర్డులో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయి నర్సింహారావు వైరాలో నివాసముంటున్నారు. ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం వాట్సఫ్ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీరు ఐదు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. తాను ఎలాంటి విమాన టిక్కెట్లు బుక్ చేసుకోలేదని నర్సింహారావు సమాధానమివ్వడంతో ఈ విషయం ఏదో తేడాగా ఉందని సీబీఐకి ఫిర్యాదు అందిందని వాట్సఫ్ కాల్ చేసిన సదరు వ్యక్తి బెదిరించాడు.
ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు. మీ దగ్గర హవాలా డబ్బు ఉందని, మీరు మోసంతోనే హవాలా వ్యాపారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు నుంచి ఆ మేరకు సమన్లు వచ్చాయని, మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. మిమ్మల్ని అరెస్టు చేయకుండా విచారించాలంటే సుప్రీంకోర్టు సమన్లు మేరకు రూ.15 లక్షలను సుప్రీంకోర్టు ఆడిట్ విభాగానికి జమచేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని మీ బంధువులకు,స్నేహితులకు, పోలీసులకు, ఇతరులకు ఎవరికైనా చెబితే వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించటంతో నర్సింహారావు భయపడిపోయాడు.