దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు.

రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. దీంతో మరోసారి తన భూమిని విక్రయించుకునేందుకు అక్కడ నుండే ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు మరోసారి అడ్డుపడ్డారు. దీంతో ఆవేదనకు లోనయిన రాందాస్ తన బాధను వ్యక్తం చేస్తూ సెల్పీ వీడియో విడుదల చేశాడు.

మంత్రి నారా లోకేష్ తమ సమస్యను పరిష్కరించాలని వీడియోలో వేడుకున్నాడు. అప్పుల భారంతో పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని విక్రయించుకోవాలనుకున్నా సాధ్యం కావడం లేదని, స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ఇబ్బందులు పెడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే రాందాస్ ఆరోపణలపై మాచర్ల పట్టణ పోలీసులను సంప్రదించగా రెండు నెలల క్రితం రాందాస్ తమ వద్దకు వచ్చాడని అయితే సివిల్ డిస్ప్యూట్ కావడంతోనే రెవిన్యూ అధికారుల వద్దకు పంపించామని తెలిపారు. అయితే రాందాస్ ను ఇబ్బంది పెడుతున్న రాజకీయ నేతలు ఎవరూ అన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే రాందాస్ సమస్య పరిష్కారం కోసం అటు రెవిన్యూ అధికారులు ఇటు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *