మరీ ఇలా ఉన్నావేంట్రా బాబూ.. భార్యా, పిల్లలను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో..

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక అశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి, తన భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేసస్తున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం ప్రారంభించాడు.

ఈ విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు.

ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజశేఖర్ దీపు లను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయంశంగా మారింది.

About Kadam

Check Also

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు వీటిల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *