నో హెల్మెట్, నో ఇన్స్యూరెన్స్.. నో పెట్రోల్.. త్వరలోనే హైదరాబాద్ లో

నో హెల్మెట్..నో ఇన్సూరెన్స్… నో పెట్రోల్, డీజిల్..! కొత్త నిబంధనలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుంది. వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు.

తెలంగాణలో కూడా నో హెల్మెట్, నో ఇన్స్యూరెన్స్.. నో పెట్రోల్ ను అమలు చేసే విధంగా చర్యలు చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. రోడ్డు రవాణా మాసోత్సవలలో భాగంగా దీనిపై ఉన్నతాధికారులతో చర్చింది నిర్ణయం తీసుకుంటామని అతి తొందర్లో తెలంగాణలో కూడా నో హెల్మెట్, నో ఇన్స్యూరెన్స్.. నో పెట్రోల్ ను అమలు చేస్తామన్నారు. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్ప నిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి.

కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) 24 లో దేశంలో 40 కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు 50 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉందని తెలుస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే 2,000 రూపాయలు జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే 4,000 రూపాయలు వరకు జరిమానా ఉంటుంది.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *