ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి.. హరీష్‌రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు అయ్యింది.

మాజీమంత్రి హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌‌గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు చక్రధర్‌‌గౌడ్. ఆయన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అధికారులు. సెక్షన్ 120 (b), 386, 409, ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *