ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎగ్జామినేషన్కు సంబంధించిన పరీక్ష తేదీలను ఎస్బీఐ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 2, 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. అభ్యర్థులు ఈ కింది వెబ్ సైట్ లింక్ ద్వారా పరీక్ష షెడ్యూల్ను చెక్ చేసుకోవచ్చు.
ఎన్సీసీ కేడెట్లకు గరిష్ఠంగా 15 శాతం గ్రేస్ మార్కులు
ఎన్సీసీ ఈవెంట్లలో అవార్డులు సాధించిన అభ్యర్థులకు డిప్లొమా, యూజీ, పీజీ కోర్సుల్లో 1 శాతం కోటా సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జులై 16న జారీ చేశారు. సాంకేతిక ఉన్నత విద్య, వ్యవసాయ, పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల్లోని అన్ని డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. ఆయా కోర్సుల ప్రవేశాల్లో ఎన్సీసీ కేడెట్లకు ప్రవేశ పరీక్షల్లో ఏకంగా 15 శాతం వరకు గ్రేస్ మార్కులను కలపనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు ఈ గ్రేస్ మార్కులు ఇస్తారు. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లోనూ ఎన్సీసీ కేడెట్లకు ప్రవేశపరీక్షల్లో 15 శాతం గ్రేస్ మార్కులు కలుపుతారు.