ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఇంతకీ ఎప్పుడంటే?

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన..

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్‌ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎగ్జామినేషన్‌కు సంబంధించిన పరీక్ష తేదీలను ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 2, 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. అభ్యర్థులు ఈ కింది వెబ్ సైట్ లింక్ ద్వారా పరీక్ష షెడ్యూల్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఎన్‌సీసీ కేడెట్లకు గరిష్ఠంగా 15 శాతం గ్రేస్‌ మార్కులు

ఎన్‌సీసీ ఈవెంట్లలో అవార్డులు సాధించిన అభ్యర్థులకు డిప్లొమా, యూజీ, పీజీ కోర్సుల్లో 1 శాతం కోటా సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ జులై 16న జారీ చేశారు. సాంకేతిక ఉన్నత విద్య, వ్యవసాయ, పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల్లోని అన్ని డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. ఆయా కోర్సుల ప్రవేశాల్లో ఎన్‌సీసీ కేడెట్లకు ప్రవేశ పరీక్షల్లో ఏకంగా 15 శాతం వరకు గ్రేస్‌ మార్కులను కలపనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు ఈ గ్రేస్‌ మార్కులు ఇస్తారు. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లోనూ ఎన్‌సీసీ కేడెట్లకు ప్రవేశపరీక్షల్లో 15 శాతం గ్రేస్‌ మార్కులు కలుపుతారు.


About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *