ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా వెళ్లాలనే ఆత్రుతో లేక ప్రమాదం జరిగితే మాకేమవుతుందిలే అనే అహంకారమో.. తెలియదు గానీ బస్ డ్రైవర్లు అధిక స్పీడ్తో బస్సులను నడిపి ఆటోలను ద్విచక్ర వాహనాలను గుద్దేసుకుంటూ నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పోరుమామిళ్ల కాలువ కట్ట సమీపంలో ఆటోను …
Read More »Tag Archives: andhra pradesh
అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? తల్లడిల్లిన కన్నపేగు
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకు.. నిండా ఐదేళ్లు కూడా నిండని పసి మొగ్గ.. ఆ తల్లి కళ్ల ముందే లారీ చక్కాల కింద చిద్రమైపోయాడు. అక్కడికక్కడే బిడ్డ ప్రాణాలు వదిలడం చూసిన ఆతల్లి.. ఇంత ఘోరం చూశాక తన ప్రాణం ఎందుకు పోలేదా? అని గుండెలవిసేలా రోదించింది.. దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది కరుణలేని విధి. వచ్చీరాని మాటలతో తప్పటడుగులు వేస్తూ తమ కళ్లముందు తిరుగుతూ సందడి చేసిన తన గారాల పట్టి.. చూస్తుండగానే అశువులు బాయడం చూసిన …
Read More »ఫోన్ కొట్టు.. పల్స్ పట్టు.. ఇకపై అలా నడవాల్సిందే.. చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు..
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నది ఆ నిర్ణయం. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే సేవలలో మార్పులు, కొనసాగించాలని ముఖ్యమంత్రి తాజా ఆదేశాలిచ్చారు.. మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అందుకు ఐవిఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని సూచించారట. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని, నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని …
Read More »స్కూల్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీఈ మార్కుల విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే
రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మూల్యాంకన విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీసీఈ మార్కుల్లో విద్యాశాఖ మార్పులు చేసి.. కొత్త విధానాన్ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నూతన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో మార్కుల విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ క్రమంలో గతంలో ఉన్న విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. గతంలో రాత పరీక్షకు 20 మార్కులు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 35 మార్కులకు మార్చింది. ఫార్మెటివ్ …
Read More »ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా
టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్ అవుతారు. …
Read More »యువకుడిపై యాసిడ్తో దాడికి యత్నం.. ఆ యువతి నిజంగానే అంత పని చేసిందా!
వివాహేతర సంబంధాలు, సహజీవనం.. వివిధ సందర్భాలలో తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు తీసే వరకు లేదా తీసుకునే వరకు వెళ్తున్నాయి.. తాజాగా.. ఏపీలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.. వాస్తవానికి ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే దాడులపై పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రేమించిన యువతి మోసం చేసినా, తాన మాట వినకపోయినా యువకులు యాసిడ్ దాడి చేయటం, కత్తులతో బెదిరించటం, హతమార్చడం వంటి ఘటనలు చాలానే చూశాం.. కానీ విజయవాడకు చెందిన ఓ మహిళ తనతో సహజీవనం చేసిన వ్యక్తిపై యాసిడ్ …
Read More »దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.. పోలీసుల వినూత్న నిర్ణయం
ప్రస్తుతం టెక్నాలజీ అన్ని రంగాల్లో పెరుగుతోంది. పోలీసులు కూడా ఈ టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ఓ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు…డిసెంబర్ నెలవస్తోంది ఈ నెల మూడో వారం నుంచి పూర్తిగా ప్రజలంతా సెలవులోకి వెళ్లి పోతారు క్రిస్టమస్ , న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు దూరప్రాంతాల్లో ఉన్న తమ ఊళ్ళకి వెళుతూ ఉంటారు, ఎక్కడెక్కడ నుంచో పొట్ట చేత …
Read More »Fengal Cyclone: వామ్మో.. హడలెత్తిస్తున్న ‘ఫెయింజల్’ తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఫెయింజల్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రాజధాని చెన్నై నగరం.. సముద్రాన్ని తలపిస్తోంది. చెన్నైతో పాటు మరో 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెంగల్పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఫెయింజల్ తుఫాన్.. ప్రస్తుతానికి మహాబలిపురంకి 50కి.మీ, పుదుచ్చేరికి 80 కి.మీ, చెన్నైకి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. గంటకు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. పుదుచ్చేరి సమీపంలో …
Read More »మంత్రి నారాలోకేశ్ను కలిసిన మంచు విష్ణు.. కారణమేమిటంటే?
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (నవంబర్ 30) వీరిద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీతో పాటు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. అనంతరం నారా లోకేశ్ తో భేటీకి సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు మంచు …
Read More »గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీ ప్రజలకు సంక్రాంతి నుంచి..
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ రెండోవ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల.. ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ రెండోవ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబోతోంది. ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలలో మార్పులు …
Read More »