అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి …
Read More »Tag Archives: andhra pradesh
కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుబాటకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హామీలు అమలు …
Read More »చివరి నిమిషంలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది.. బుధవారం పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది.. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి రేపు సా.4:12కు PSLV C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ …
Read More »భవిష్యత్తు అమరావతికి తొలి అడుగు.. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు..!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం, రాజకీయ విమర్శలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటి మధ్య ఆయన రాజధాని అభివృద్ధి కోసం కొనసాగించిన కృషి ప్రశంసలకు పాత్రమైంది. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదన్న విమర్శ తరచూ గట్టిగా వినిపిస్తూ వచ్చేది. ఈ విమర్శలకు సీఎం చంద్రబాబు ఇప్పుడు చెక్ పెట్టారు. త్వరలో సీఎం చంద్రబాబు ఇంటి చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా లింగమేనని అతిథిగృహంలో ఉంటున్న …
Read More »ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు
మన దేశంలో ఏ స్టేషన్లో చూసిన రైలు కరెక్ట్ టైంకి రావడం అనేది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. తరచూ రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తుంటారు. అయితే ఈ అసౌకర్యానికి చెక్ పెట్టేందుకు రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు స్పెషల్ ఆపర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో మాదిరి ప్రయాణించవల్సిన రైలు ఆలస్యం వస్తే రైల్వే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద …
Read More »శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు
వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహా విష్ణువు ఇలవైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించి కోనేతిరాయుడి అనుగ్రహం పొందాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత శ్రీవారి ప్రసాదం లడ్డుకి ఉంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే లడ్డు తీసుకుని రా అని చెబుతారు. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి ఎంత ఫేమసో.. శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఈ లడ్డు రుచి గురించి …
Read More »ఏపీపీఎస్సీలో వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మొత్తం నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. అయితే ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్-2, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీలను కమిషన్ కార్యదర్శి ప్రదీప్కుమార్ వెల్లడించారు. ఏయే …
Read More »లక్ష చెట్లు నేలకూలిన చోటే మళ్లీ భూకంపం.. సరిగ్గా నాలుగు నెలల్లో.. అసలు మ్యాటర్ ఏంటి..?
తెలంగాణలో బుధవారం (4 డిసెంబర్ 2024) తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, తెలంగాణలోని ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు హైదరాబాద్ వరకు కూడా కనిపించాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం 7:27 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమి నుండి 40 కిలోమీటర్ల లోతులో ఉంది. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ప్రకంపనలు ఈ భూకంపం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించింది. ప్రస్తుతం, …
Read More »అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు?.. ఎన్ని ఎకరాలంటే, కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు.. చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్గా చెబుతున్నారు.. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్ 25 వేల చదరపు గజాలు కాగా.. ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉందని. అలాగే …
Read More »ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు.. ప్రతి రోజూ కాలేజీల్లో ఉచితంగా, మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో …
Read More »